న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ విజయం సాధిస్తే ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ పాకిస్థాన్ ప్రధాని అవుతాడని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పాక్ 1992 సెంటిమెంట్పై స్పందిస్తూ గవాస్కర్ సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
— Guess Karo (@KuchNahiUkhada) November 10, 2022
ఇక గవాస్కర్ స్పందిస్తూ.. 'పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ గెలిస్తే 2048లో బాబర్ ఆజం పాకిస్థాన్ ప్రధాని అవుతాడు' అని చెప్పగా.. పక్కన ఉన్న షేన్ వాట్సాన్, మైఖేల్ ఎర్త్టన్ పగలపడి నవ్వారు. ఈ సెంటిమెంట్లు పనిచేయవనే ఉద్దేశంతో గవాస్కర్ ఇలా సెటైర్లు పేల్చాడు. 1992 ప్రపంచకప్లో పాక్ జట్టును ఇమ్రాన్ ఖాన్ టైటిల్ నడిపించగా.. ఆయన 2018లో పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. దాంతో పాక్ టైటిల్ గెలిస్తే బాబర్ 2048లో ప్రధాని అవుతాడని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి పాకిస్థాన్ ఏకంగా ఇప్పుడు ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి.. ఫైనల్కు బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. ఇంగ్లండ్తో జరిగే చివరి పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. 2009లో టీ20 ప్రపంచకప్ను పాకిస్థాన్ గెలుచుకోగా.. 2010లో ఇంగ్లండ్ ఛాంపియన్గా నిలిచింది. ఇప్పుడు ఏ జట్టు గెలిచినా.. రెండోసారి పొట్టికప్పును ముద్దాడినట్లు అవుతుంది.