
విమర్శలు సరికావంటూ..
ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో మహ్మద్ షమీ, సంజూ శాంసన్లకు అవకాశం ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. షమీని స్టాండ్ బై ప్లేయర్ గా కాకుండా 15మంది సభ్యులతో పాటు ఎంపిక చేస్తే బాగుండేదని.. అంతేగాక టీ20లలో సరిగా రాణించని రిషభ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ను తీసుకుని ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ది ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన గవాస్కర్ ఈ విమర్శలపై స్పందించాడు.

ఒక్కసారి ఎంపిక చేస్తే..
'టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు.. టైటిల్తోనే తిరిగి వస్తుందని నేను నమ్ముతున్నాను. రోహిత్ అండ్ కోకు ప్రతి జట్టుకు ఉండాల్సిన కాస్తంత అదృష్టం కూడా ఉంది. ఒకసారి జట్టును ఎంపిక చేసినాక ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు ఎవరైనా సరే అది మన టీమిండియానే. ఆ జట్టుకు మనం మద్దతుగా నిలవాలి. జట్టులో ఎంపికలు, పక్కనపెట్టేవారి గురించి మాట్లాడితే ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతింటుంది.'గవాస్కర్ పేర్కొన్నాడు.

నేనే సెలెక్టర్ అయితే..
జట్టు ఎంపిక గురించిన మాట్లాడిన మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ తాను మాత్రం జట్టులో షమీతో పాటు ఉమ్రాన్ మాలిక్, శుభ్మన్ గిల్ను తీసుకునేవాడినని చెప్పాడు. 'ప్రస్తుత జట్టును నేను ఎంపిక చేయాల్సి వస్తే.. మహ్మద్ షమీ తో పాటు ఉమ్రాన్ మాలిక్, శుభమన్ గిల్లను కూడా ఎంపిక చేసేవాడిని. ఈ ముగ్గురూ ఐపీఎల్లో బాగా ఆడారు.'అని తెలిపాడు.
మాజీ కెప్టెన్, హెచ్సీఏ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్ధీన్ సైతం టీమ్ ఎంపికను తప్పుబట్టాడు. 'టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టును చూసి ఆశ్చర్యానికి గురయ్యా. మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్లు ప్రధాన టీమ్లో ఉండాల్సినవాళ్లు. దీపక్ హుడా, హర్షల్ పటేల్ల స్థానాల్లో వారిని ఎంపిక చేసి ఉండాల్సింది.'అని వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications












