
పిచ్చి నిర్ణయమన్నారు..
వాస్తవానికి ఐపీఎల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ.. ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో పూర్తిగా జట్టుకు దూరమైన హార్దిక్ను సారథిగా ఎంచుకోవడం గుజరాత్ టీమ్ పిచ్చిగా అనిపించింది. అంతేకాకుండా కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ఎలాంటి అనుభవం లేదు. ఏ స్థాయి క్రికెట్ టోర్నీల్లోనూ అతను కెప్టెన్సీ చేసింది లేదు. దాంతో గుజరాత్ అనవసరంగా హార్దిక్ను కెప్టెన్గా ఎంచుకుందనే విమర్శలు వచ్చాయి.

ఆల్రౌండ్ షోతో..
కానీ హార్దిక్ పాండ్యా మాత్రం విమర్శకులంతా నోరు మూసుకునేలా తనదైన సారథ్యంతో జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. టీమిండియా భవిష్యత్తు సారథిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 15 మ్యాచ్లు ఆడిన హార్ధిక్ 487 పరుగుల తో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పెర్షామెన్స్ గురించి స్టార్ స్పోర్ట్స్ చానెల్తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగు ఓవర్లు వేయగలడా? అనే సందేహాన్ని కూడా హార్దిక్ తీర్చాడని చెప్పాడు.

కెప్టెన్ అవ్వడం ఖాయం..
'హార్ధిక్ ఖచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడు. ఇది నా అంచనా మాత్రమే కాదు. అందరి అంచనా కూడా. ఈ సీజన్లో అతను బ్యాట్తో పాటు బంతితో కూడా రాణించాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడా? లేదా? అనే సందేహం ఉండేది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అతను నాలుగో ఓవర్ల పాటు బౌలింగ్ చేసి తన సత్తా ఎంటో చూపించాడు. ఏ ఆటగాడైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే.. సమీప భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్గా అయ్యే అవకాశం ఉంటుంది.

హార్థిక్కే ఎక్కువ చాన్స్..
అయితే రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో పాండ్యా జట్టు పగ్గాలు అందుకుంటాడని చెప్పను కానీ.. అతను సెలెక్టర్లకు మంచి ఆప్షన్ అవుతాడని చెబుతున్నా. అతనితో పాటు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్యాకే ఎక్కువ అవకాశం ఉండనుంది.' అని గవాస్కర్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
