
యాషెస్ నా ప్రధాన లక్ష్యం..
ఈ క్రమంలోనే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్సైట్ క్రికెట్.కామ్. ఏయూకి తన గాయం రిహాబిలిటేషన్కు సంబంధించిన వివరాలను స్మిత్ వెల్లడించాడు.'టీ20 వరల్డ్ కప్లో పాల్గొనడం నాకు ఇష్టమే. కానీ నా దృష్టిలో టెస్ట్ క్రికెట్ అంత కంటే ఎక్కువ. ఇక నా ప్రధాన లక్ష్యం యాషెస్ సిరీస్. గత కొన్నేళ్లుగా యాషెస్ సిరీస్లో చేసింది పునరావృతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది.'అని స్మిత్ తెలిపాడు. గత మూడు యాషెస్ సిరీస్లో ఈ వరల్డ్ నెంబర్ 2 బ్యాట్స్మన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 14 మ్యాచ్ల్లో 93.76 సగటుతో 1969 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలున్నాయి.

టీ20 ప్రపంచకప్ ఆడను..
ఈ క్రమంలోనే మళ్లీ యాషెస్ సిరీస్లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చాలని స్మిత్ భావిస్తున్నాడు. ఇందుకోసం అవసరమైతే టీ20 ప్రపంచకప్కు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. 'గత యాషెస్ సిరీస్లో చూపించిన ప్రభావాన్ని చూపగల స్థితిలో నన్ను నేను ఫిట్గా ఉంచాలనుకుంటున్నాను. అవసరమైతే టీ20 ప్రపంచకప్కు కూడా దూరంగా ఉంటాను. అయితే మెగా టోర్నీకి చాలా సమయం ఉన్నందున ఆ అవసరం రాదనే ఆశాభావంతో ఉన్నాను'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

గతేడాది గ్రిప్ మార్చడంతో..
తన గాయం గురించి మాట్లాడుతూ..'గతేడాది సమ్మర్లో నా బ్యాటింగ్ గ్రిప్ మార్చిన తర్వాత ఎడమ మణికట్టులో చిన్నగా నొప్పి మొదలైంది. తరువాతి సీజన్కు ఆ నొప్పి మెల్లగా నా మోచేతిలోకి వచ్చింది. దాంతో డొమెస్టిక్ క్రికెట్కు కొంత కాలం బ్రేక్ ఇచ్చాను. సరిగ్గా ఐపీఎల్కు ముందు న్యూ సౌత్ వేల్స్ తరఫున 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్ ఆడను. ఐపీఎల్ సమయంలోనూ పూర్తిగా ఫిట్లేను. చాలా నొప్పితోనే బ్యాటింగ్ చేశాను. బ్యాటింగ్ చేసిన ప్రతీసారి పెయిన్ కిల్లర్స్, యాంటి ఇన్ఫ్లేమటరీస్లను తీసుకునేవాడిని. కానీ ఆ తర్వాత నొప్పి ఎక్కువవ్వడంతో గాయం తగ్గలేదని గ్రహించాను.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్మిత్ 6 మ్యాచ్లు ఆడిన విషయం తెలిసిందే.
గతంలో ఇదే తరహా గాయంతో బాధపడిన మాజీ క్రికెటర్లు బ్రాడ్ హడిన్, పీటర్ నెవిల్, కామెరూన్ వైట్ సలహాలు, సూచననలు తీసుకున్నానని, ఓ దశలో ప్లాస్మా ఇంజెక్షన్ తీసుకునేందుకు సిద్దమయ్యానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గాయం మెరుగైందని, 10 నిమిషాల పాటు బ్యాటింగ్ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












