
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు రెండు దేశాల అభిమానులు ఎగబడటంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ట్ స్పోర్ట్స్ పంట పండింది. టీ20 చరిత్రలోనే ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టింది. రికార్డు స్థాయిలో 167 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు 136 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్ బ్రేక్ చేసింది.
ఈ వ్యూస్ లెక్కలను స్టార్ ఇండియానే తెలిపింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.'అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 24న జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్కు రికార్డు స్థాయిలో 167 మిలియన్ వ్యూస్ లభించాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్కు (టీమ్ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్ వ్యూస్ వచ్చాయి," అని స్టార్ ఇండియా తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. మెగా టోర్నీ మొదలైనప్పటి నుంచి సెమీస్ క్వాలిఫయర్స్ వరకు అన్ని మ్యాచ్లు కలిపి 238మిలియన్ల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా స్పష్టం చేసింది.
క్రికెట్ వ్యూయర్షిప్ను పెంచేందుకు మరింత కృషి చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత జట్టు చెత్తాటతో కనీసం సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు.. ఆ తర్వాత అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియాలపై భారీ విజయాలు సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నాకౌట్కు అర్హత సాధించాయి.
అయితే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో టీ20 ప్రపంచకప్ కళ తప్పినట్లైంది. టోర్నీపై భారత అభిమానుల ఆసక్తి తగ్గింది. ఇది స్టార్ స్పోర్ట్స్కు భారీ నష్టాలను తెచ్చిపెట్టనుంది. భారత్-పాక్ మ్యాచ్కు 5 నిమిషాల యాడ్కు రూ.25-30 లక్షల వసులూ చేసిన స్టార్ స్పోర్ట్స్.. భారత్ సెమీస్, ఫైనల్ చేరితే రెట్టింపు వసూలు చేయాలని భావించింది. కానీ ఆ ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి.