అసలేం జరిగిందంటే..?
సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ను హార్దిక్ పాండ్యా వేయగా.. రెండు, మూడు బంతులను కేన్ విలియమ్సన్ భారీ సిక్సర్లుగా మలిచాడు. ఇక ఈ ఓవర్ చివరి బంతిని బ్యాక్ ఆఫ్ లెంగ్త్గా పాండ్యా వేయగా.. రాహుల్ త్రిపాఠి అప్పర్ కట్ ఆడాడు. దాంతో బంతి గాల్లోకి లేచి నేరుగా డీప్ థర్డ్ మ్యాన్లో పడింది.
అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ షమీ ఆ బంతిని అందుకోలేకపోయాడు. అతనికి రెండు అడుగల ముందే బంతి పడగా షమీ క్యాచ్ కోసం కనీస ప్రయత్నం చేయలేదు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హార్దిక్ పాండ్యా.. షమీపై గట్టిగా అరిచేసాడు. క్యాచ్ పట్టక ఏం పీ..తున్నావ్? అని హిందీలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. హార్దిక్ తీరు పట్ల షమీ నిర్ఘాంతపోయాడు.

ఇంత అహంకారమా?
హార్దిక్ పాండ్యా తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హార్దిక్లో నాయకుడి లక్షణాలు లేవని, జట్టు సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరికాదని విమర్శిస్తున్నారు. అసలు కెప్టెన్సీ చేయడానికి అతడు అర్హుడే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సన్రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్లు కూడా క్యాచ్లు వదిలేశారని, అయినా కేన్ విలియమ్సన్ సంయమనం పాటించాడని గుర్తు చేస్తున్నారు.
హార్దిక్ మాత్రం టీమిండియాలో సీనియర్ అయిన షమీ మీదకు అరుస్తాడా? కెప్టెన్ అయ్యానని అహంకారమా? అని మండిపడుతున్నారు. కెప్టెన్సీలో ధోనీతో పోటీ పడతానని చెప్పిన హార్దిక్.. జార్ఖండ్ డైనమైట్ మిస్టర్ కూల్ అన్న విషయం మరిచిపోయాడా? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తొలిసారి కాదు..
ఇక హార్దిక్ ఇలా అరవడం ఇదే తొలిసారి కాదు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ అతను సహనం కోల్పోయాడు. ముందుగా ఫీల్డింగ్లో తప్పిదం చేసిన యువ ప్లేయర్ దర్శన్పై అరిచిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత బ్యాటింగ్లో రనౌట్ అయిన బాధలో మిల్లర్పై అరిచాడు. వాస్తవానికి రనౌట్ విషయంలో మిల్లర్ది ఏం తప్పులేదు. హార్దిక్ పాండ్యానే పరుగెత్తి రనౌటయ్యాడు. కెప్టెన్ ఇలా ఆటగాళ్లపై అరవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

కేన్ మామ సూపరో సూపర్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (42 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్తో 50 నాటౌట్) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్ మనోహర్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్తో 35) రాణించాడు. అనంతరం హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ విలియమ్సన్ (46 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లు 57) హాఫ్ సెంచరీ సాధించగా, అభిషేక్ శర్మ (32 బంతుల్లో 6 ఫోర్లతో 42), పూరన్ (18 బంతు ల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) మెరిశారు.


Click it and Unblock the Notifications












