మూడూ భారత్కే..
ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడో అవార్డు కూడా టీమిండియా ఆటగాడికే దక్కడం విశేషం. జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్లు ఈ అవార్డుకు ఎంపికవ్వగా.. మార్చి నెల అవార్డును భువీ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మహిళల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా దక్షిణాఫ్రికా బ్యాటర్ లిజెల్ లీ ఎంపికయ్యారు. ఈ విభాగంలో లిజెల్ లీతో పాటు రేసులో ఇద్దరు భారత అమ్మాయిలు రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ రౌత్ ఉన్నప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లిజెల్ లీనే ఈ అవార్డు వరించింది.

ఓటింగ్ ద్వారా విజేత..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

సన్రైజర్స్ సంతోషం..
సన్రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మార్చికి సంబంధించి 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు సాధించాడు. ఆ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ ఆడని భువి తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణించి మళ్లీ టీమ్ఇండియాకు ఎంపికయ్యాడని, ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్ సందర్భంగా అత్యుత్తమ ప్రదర్శన చేసి ఈ అవార్డు సొంతం చేసుకున్నాడని పేర్కొంది.


Click it and Unblock the Notifications












