For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH: రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ఐపీఎల్ 2021 ఆడుతారు!

SRH confirms Rashid Khan and Mohammad Nabi’s availability in IPL 2021

హైద‌రాబాద్‌: తమ టీమ్‌కు చెందిన అఫ్గానిస్థాన్‌ క్రికెట‌ర్లు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడుతారని సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్ల భ‌విష్య‌త్తు గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది. ఈ క్రమంలోనే వారు ఐపీఎల్‌ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆడ‌తారో లేదో అన్న సందిగ్ధం నెల‌కొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం క్లారిటీ ఇచ్చింది.

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన సన్‌రైజర్స్ టీమ్ సీఈవో ష‌ణ్ముగం ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. 'ప్ర‌స్తుతం అక్క‌డ ఏం జ‌రుగుతున్న‌దానిపై మేము మాట్లాడ‌లేం. కానీ వాళ్లు మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు'అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ నెల 31న త‌మ టీమ్ యూఏఈకి బ‌య‌లుదేరుతోంద‌ని ష‌ణ్ముగం వెల్ల‌డించారు.

ది హండ్రెడ్ లీగ్‌లో రషీద్, నబీ..

ది హండ్రెడ్ లీగ్‌లో రషీద్, నబీ..

ప్ర‌స్తుతం ర‌షీద్ ఖాన్‌, న‌బీ ఇద్ద‌రూ హండ్రెడ్ టోర్నీ కోసం యూకేలో ఉన్నారు. ర‌షీద్ ట్రెంట్ రాకెట్స్‌కు, న‌బీ లండ‌న్ స్పిరిట్స్‌కు ఆడుతున్నారు. అయితే వీళ్లు అక్క‌డి నుంచి నేరుగా యూఏఈ వ‌చ్చి ఐపీఎల్‌ 14 రెండో దశల మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే త‌న కుటుంబాన్ని అఫ్గానిస్థాన్ నుంచి ఎలా తీసుకురావలన్నదానిపై ర‌షీద్ ఖాన్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ తెలిపాడు. కాబూల్ ఎయిర్‌స్పేస్ మూసేయ‌డంతో అక్క‌డి నుంచి వివిధ దేశాల‌కు విమాన రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

సంక్షోభంలో అఫ్గాన్ క్రికెట్..

సంక్షోభంలో అఫ్గాన్ క్రికెట్..

సంక్షోభంలో ఉన్న అఫ్గానిస్తాన్ క్రికెట్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. ఈ నెల‌లోనే ఆఫ్ఘ‌నిస్థాన్ టీమ్ శ్రీలంక టూర్ కూడా వెళ్లాల్సి ఉంది. ఆపై ఆస్ట్రేలియాతో ట్రై సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేసింది. ఈ రెండు పర్యటనలు రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఐపీఎల్ 2021 ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అనుమానంగా మారగా.. ఆ వెంటనే జరిగే టీ20 ప్రపంచకప్‌లలో ఆ దేశ టీం పాల్గొనడం కూడా డౌటే. టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ ఉండగా.. ఆ గ్రూప్‌లో భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. అఫ్గానిస్థాన్ టాప్ జట్లను ఓడించడం కష్టమే. రషీద్‌ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

దేశం విడిచి పారిపోయిన..

దేశం విడిచి పారిపోయిన..

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం చేసుకోగానే.. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ఆదివారం దేశం విడిచి వెళ్లిపోయాడు. అనంతరం తాలిబన్లు అధ్యక్షుడి భవనాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. దేశం విడిచి పారిపోయాడనే అపవాదు రాకుండా ఉండేందుకు అష్రఫ్‌ ఘనీ దేశ పౌరులను ఉద్దేశించి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాడు.

ఆ లేఖలో తానెందుకు దేశం విడిచి వెళ్లిపోవాల్సి వచ్చిందనే విషయాలను విడమర్చి చెప్పారు. రెండు ద‌శాబ్దాల త‌ర్వాత మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గానిస్థాన్‌లో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాజాగా రాజ‌ధాని కాబూల్‌లో ఏయిర్ స్పేస్‌ను మూసివేసిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. దీంతో అక్క‌డి ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలాంటి విమాన రాక‌పోక‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది.

Story first published: Monday, August 16, 2021, 15:40 [IST]
Other articles published on Aug 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+