For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

BCCI బాస్ సౌరవ్ గంగూలీకి చెక్ పెట్టింది ధోనీనే.. సీఎస్‌కే యజమానితో చక్రం తిప్పిన మహీ!

 Sourav Ganguly A Victim of MS Dhoni conspiracy, how CSK captain used N Srinivasan?

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతల నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకోవడం ఏమో గానీ.. సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. బీజేపీ రాజకీయాలకు సౌరవ్ గంగూలీ బలయ్యాడని తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తే.. జై షా వెన్నుపోటు పొడిచాడని దాదా ఫ్యాన్స్ వాపోయారు. చేసుకున్న పాపం ఎక్కడికి పోదని, కర్మ సిద్దాంతం అనుభవించాల్సిందేనని కోహ్లీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ సెలెక్షన్‌లో అతి జోక్యం.. బోర్డులో దాదా గిరి సభ్యులకు నచ్చలేదని, దాంతో రెండోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగేందుకు నిరాకరించారని ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్‌బజ్ పేర్కొంది. తాజాగా సౌరవ్ గంగూలీ పదవి తొలగింపు వెనుక ధోనీ హస్తం కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది.

 శ్రీనివాసన్‌తో చెక్..

శ్రీనివాసన్‌తో చెక్..

చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్, మాజీ బీసీసీఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ద్వారా గంగూలికి ధోనీ చెక్ పెట్టాడనేది ఆ వార్తల సారాంశం. బీసీసీఐకి అధ్యక్షుడిగా పనిచేసిన ఎన్ శ్రీనివాసన్, సౌరవ్ గంగూలీ పనితనం విషయంలో విమర్శలు గుప్పించారట. అతని స్థానంలో రోజర్ బిన్నీని బీసీసీఐ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని బీసీసీఐ సమావేశంలో గట్టిగా వాదించారట. సీఎస్‌కే బాస్ ఏం చేసినా దాని వెనక మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం ఉంటుందనేది చాలా మందికి తెలిసిన విషయమే. ధోనీ సూచనలతో సీఎస్‌కే బాస్ గంగూలీకి వ్యతిరేకంగా మాట్లాడడంట.

వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయలేదనే..

వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయలేదనే..

మరి ధోనీకి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై ఎందుకు ఇంత కక్ష? ఎందుకో అనే విషయం అర్థమవడం లేదు. బీసీసీఐ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ.. ధోనీకి చెక్ పెట్టాడు. టీమ్ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు. దాంతో మరో గత్యంతరం లేక ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ధోనీకి బీసీసీఐ.. కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు. ఈ విషయంలో బీసీసీఐ‌పై ధోనీ ఫ్యాన్స్ కూడా ఆగ్రహంగా ఉన్నారు.

కోహ్లీపై నమ్మకం లేకనే..

కోహ్లీపై నమ్మకం లేకనే..

అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ధోనీని పిలిచి మరీ, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి మెంటర్‌గా నియమించారు. అయితే ఇది రవిశాస్త్రి, విరాట్ కోహ్లీల సామర్థ్యంపై నమ్మకం లేకనే గంగూలీ ఈ పని చేశాడని, టీమ్ సెలెక్షన్ కూడా అతనే చేశాడనే ప్రచారం జరిగింది. ఏది ఏమైనప్పటికీ.. గంగూలీ తప్పించడం వెనుక ధోనీ హస్తం కూడా ఉందనే ప్రచారం ఊపందుకుంది. దాదా మాత్రం ఈ ఆరోపణలను పట్టించుకోకుండా.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని బదులిచ్చాడు.

ఎవరికీ శాశ్వతం కాదు..

ఎవరికీ శాశ్వతం కాదు..

ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా మాట్లాడుతూ.. 'నేను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ఐదేళ్లు అధ్యక్షుడిగా పనిచేశాను. బీసీసీఐ చీఫ్‌గా కూడా మూడేళ్లు ఉన్నాను. ఇవన్నీ ముగిశాక బీసీసీఐ నుంచి నిష్క్రమించే సమయం వచ్చింది. ఒక అడ్మినిస్ట్రేటర్‌గా జట్టు ప్రయోజనాల కోసం పాటుపడాలి. నేను ఆటగాడిగా ఉన్నప్పుడు ఇదే అర్థం చేసుకున్నాను. ఆటగాడి నుంచి పరిపాలనకు వచ్చాక కూడా నేను నా పనిని సంతోషంగా నిర్వర్తించాను. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఆటగాడిగా కానీ అడ్మినిస్ట్రేటర్ గా గానీ ఎక్కువ కాలం పదవిలో ఎవరూ ఉండలేరు.'అని తెలిపాడు.

Story first published: Thursday, October 13, 2022, 20:19 [IST]
Other articles published on Oct 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+