లాహోర్: ఆసియాకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక 292 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. కీపర్ కమ్ బ్యాటర్ కుశాల్ మెండీస్(84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 92) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(41) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఈ ఇద్దరికి తోడుగా చరిత్ అసలంక(36), దునిత్ వెల్లేగే(33 నాటౌట్) రాణించారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ నబీ (4/60) నాలుగు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కు 63 పరుగులు జోడించారు. క్రీజులోకి వచ్చిన సమరవిక్రమా(3) విఫలమైనా.. చరిత్ అసలంక(36) రాణించాడు. కెప్టెన్ డసన్ షనక విఫలమైనా.. దునిత్ వెల్లలేగే(33 నాటౌట్) రాణించాడు.
