హసరంగా బౌలింగ్ను...
'ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని ముందే ఊహించా. మా టీమ్ బౌలింగ్కు దిగే ముందే మా ఆటగాళ్లకు ఈ మ్యాచ్ మన అసలు సిసలు సత్తాకు పరీక్షగా నిలుస్తుందని చెప్పాను. మనం కనబర్చే పోరాటమే మానసిక స్థితిని తెలియజేస్తుందన్నా. ఈ మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడం పట్ల గర్వపడుతున్నా. చివర్లో వెంకటేశ్ అయ్యర్కే బంతిని ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే అతనికి అంతర్జాతీయ అనుభవం ఉంది. ఆరంభంలోనే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచడం చాలా ముఖ్యం. ఈ పిచ్పై విపరీతమైన పేస్, బౌన్స్ ఉంది. వానిందు హసరంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్ని ఆఫ్ స్పిన్నర్గా ఆడాలని ముందు అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ ప్రణాళికలను అమలు పర్చలేకపోయాం'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
అదరగొట్టిన హసరంగా..
ఈ మ్యాచ్లో హసరంగా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన తొలి ఓవర్లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(13)ను ఔట్ చేసిన హసరంగా.. ఆ తర్వాత వరుస బంతుల్లో సునీల్ నరైన్(12), షెల్డన్ జాక్సన్(0)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. చివరి ఓవర్లో టీమ్ సౌథీ(1) ఔట్ చేసి ఐపీఎల్లోనే 4/20 బెస్ట్ గణంకాలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అతనికి తోడు హర్షల్ పటేల్(2/11) కూడా రాణించడంతో కేకేఆర్ బ్యాట్స్మెన్ పెవిలియన్కు క్యూ కట్టారు.
సిక్సర్తో గెలిపించిన కార్తీక్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్లో ఆండ్రీ రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. షెబాజ్ అహ్మద్(20 బంతుల్లో 3 సిక్స్లతో 27), షెర్ఫెన్ రూథర్ఫోర్డ్(40 బంతుల్లో ఫోర్, సిక్స్తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దినేశ్ కార్తీక్((7 బంతుల్లో ఫోర్, సిక్స్తో 14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.


Click it and Unblock the Notifications
