For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత డ్రెస్సింగ్ రూమ్‌ సూపర్.. కులమతాలతో సంబంధం లేకుండా: అక్తర్‌

Shoaib Akhtar praises Indian dressing room for backing their players

కరాచీ: భారత డ్రెస్సింగ్ రూమ్‌ను‌ పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ షోయబ్‌ అక్తర్ కొనియాడాడు. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ అద్భుతమని ప్రశంసించాడు. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు హైదరాబాదీ పేసర్‌ మొహ్మద్ సిరాజ్‌కు మద్దతుగా నిలిచారన్నాడు. తండ్రిని కోల్పోయిన బాధను పంటి బిగువున భరిస్తూ సిరాజ్ బాక్సింగ్ డే టెస్టులో గొప్ప ప్రదర్శన చేశాడని అక్తర్ పేర్కొన్నాడు. స్పోర్ట్స్ టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అక్తర్‌ పలువిషయాలపై స్పదించాడు.

భారత డ్రెస్సింగ్ రూమ్‌ సూపర్:

భారత డ్రెస్సింగ్ రూమ్‌ సూపర్:

'మొహ్మద్ సిరాజ్‌కు నా ప్రగాఢ సానుభూతి. క్లిష్ట సమయంలో బీసీసీఐ, సహచర ఆటగాళ్లు అతడికి మద్దతుగా నిలిచారని భావిస్తున్నా. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎంతో కఠినంగా ఉంటాయి. కులం, జాతి, మతం అనే తేడా లేకుండా ఆటగాళ్లకు మద్దతు ఇస్తున్నట్లు భారత్ అద్భుతం. మైదానంలో జట్లు తయారు చేయబడవు, డ్రెస్సింగ్ రూమ్‌లలో జట్లు తయారు చేయబడతాయి. ఆస్ట్రేలియాపై 36 పరుగులు చేసిన తరువాత భారత్ గొప్పగా పుంజుకుంది. అందులో డ్రెస్సింగ్ రూమ్ పాత్ర కీలకం అని నేను భావిస్తున్నా' అని అక్తర్ అన్నాడు..

ఆ క్షణాల్ని సిరాజ్‌ తండ్రి చూడాల్సింది:

ఆ క్షణాల్ని సిరాజ్‌ తండ్రి చూడాల్సింది:

'భారత్ తరఫున మొహ్మద్ సిరాజ్‌ ఆడుతున్న క్షణాలను అతడి తండ్రి చూడాలని ఎంతో ఆశించాడు. కానీ అది జరగలేదు. అయితే సిరాజ్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే కాదు, గొప్ప ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. అలాంటి మధుర క్షణాలను అతడి తండ్రి చూడాల్సింది. బాక్సింగ్‌ డే టెస్టులో సిరాజ్‌ ఎంతో భావోద్వేగం చెంది ఉంటాడు. అరంగేట్రంలోనే అతడు అయిదు వికెట్లతో సత్తాచాటాడు. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో తన వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు' అని పాకిస్థాన్‌ దిగ్గజ పేసర్‌ పేర్కొన్నాడు.

తండ్రి కల కోసం:

తండ్రి కల కోసం:

ఐపీఎల్‌ 2020లో మెరుగైన ప్రదర్శన చేసిన మొహ్మద్ సిరాజ్‌ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా విధి అతడిని పరీక్షించింది. జట్టుతో కలిసి సిడ్నీ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో సిరాజ్‌ తండ్రి అనారోగ్యంతో మరణించారు. భారత్‌కు వెళ్లి వస్తే క్వారంటైన్‌ ఇబ్బందులుంటాయన్న ఉద్దేశంతో అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. భారత్‌ తరఫున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహిస్తే చూడాలనుకున్న తన తండ్రి కల కోసం.. బాధను భరిస్తూ ఆసీస్‌లోనే ఉండిపోయాడు. గొప్ప ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

రహానే బ్యాట్‌తో పోరాడాడు:

రహానే బ్యాట్‌తో పోరాడాడు:

ఆస్ట్రేలియాపై విజయం సాధించడానికి అసలు కారణం భారత బౌలర్ల కృషేనని షోయబ్ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా బోల్తా కొట్టించాలనే కోడ్‌ను టీమిండియా బౌలర్లు ఛేదించారని అన్నాడు. టెస్టు సిరీస్‌ విజయ మార్గంలో భారత్‌ పయనిస్తుందని పేర్కొన్నాడు. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై మాట్లాడుతూ.. గులాబి బంతిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే టీమిండియా ఓటమికి కారణమని అక్తర్‌ అన్నాడు. అజింక్య రహానే తన బ్యాట్‌తో పోరాడాడని, సారథ్యం బాగుందని ప్రశంసించాడు. విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ లేకున్నా.. భారత్ అద్భుత విజయాన్ని అందుకుందని చెప్పుకొచ్చాడు.

రూల్స్ బ్రేక్ చేసి అడ్డంగా బుక్ అయిన నలుగురు భారత క్రికెటర్లు.. చర్యలు తప్పవా?

Story first published: Saturday, January 2, 2021, 13:02 [IST]
Other articles published on Jan 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+