ఫిట్నెస్ పెంచుకునేందుకు జిమ్లో శ్రమిస్తూ
టెస్టు జట్టులో స్థానం కోల్పోవడంతో ప్రస్తుతం శిఖర్ ధావన్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూనే.. ఫిట్నెస్ పెంచుకునేందుకు జిమ్లో శ్రమిస్తున్నాడు. వెస్టిండీస్తో ఈ నెల 21 నుంచి ఐదు వన్డేల సిరీస్లో తలపడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత మూడు టీ20 సిరీస్ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. ధావన్కి వన్డే, టీ20 జట్టులో అవకాశమిస్తారా..? లేక పృథ్వీ షానే ఓపెనర్గా కొనసాగిస్తారా..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కోహ్లీ, బుమ్రా, భువీలకు విశ్రాంతి?: విండిస్తో ఐదు వన్డేలకు కెప్టెన్గా రోహిత్!
తొలి టెస్టులో సెంచరీతో తనవైపుకు
ధావన్ స్థానంలో చోటు దక్కించుకున్న పృథ్వీ షా (134) వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులోనే మెరుపు సెంచరీతో అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. ఎన్నో రికార్డులను కొల్లగట్టాడు. దీంతో.. ధావన్తో పాటు మరో సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ స్థానానికీ కూడా పృథ్వీ షా ఎసరు పెట్టేసినట్లు అయింది.
సెలక్షన్ కమిటీపై ఆరోపణలు గుప్పిస్తూనే:
ఇప్పటికే ఈ సిరీస్లో తమకు స్థానం దక్కలేదంటూ కరుణ్ నాయర్.. మురళీ విజయ్లు సెలక్షన్ కమిటీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే వారు చెప్పేదంతా అబద్ధమని తాము ముందుగానే సమచారమిచ్చామంటూ సెలక్షన్ కమిటీ తరపు నుంచి ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. వీరి వాదన ఇలా ఉంటే నిజాలు తేల్చుకునేందుకు బీసీసీఐ ఇప్పటికీ విచారణ చేపట్టకపోవడం గమనార్హం.
శుక్రవారం నుంచి హైదరాబాద్లో రెండో టెస్టు
భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటికే తొలి టెస్టు ముగియగా.. భారత్ జట్టు ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం నుంచి జరగనుంది.