|
మీ ప్రేమ వెలకట్టలేనిది..
ఎస్యూవీ థార్ వాహనాల ముందు నిలబడి ఫోజిచ్చిన ఫొటోలను ఠాకూర్ పంచుకున్నాడు. 'మహీంద్రా జీ.. మీరు పంపిన థార్ ఎస్యూవీ ఇప్పుడే వచ్చింది. మీరిచ్చిన గిఫ్ట్ కంటే మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. నాకు ఇష్టమైన ఎస్యూవీ కారును గిఫ్ట్గా పంపారు.. దీనిని నడపుతుంటే తెలియని ఫీలింగ్ కలుగుతుంది.
ఆసీస్ టూర్ తర్వాత లభిస్తున్న ప్రశంసల్లో మీది ప్రత్యేకంగా కనిపించింది. దేశానికి మేం చేస్తున్న సేవలకు గుర్తుగా మీరు గిఫ్ట్ ఇచ్చినందుకు మరోసారి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.''అంటూ కామెంట్ చేశాడు. కాగా, నటరాజన్, శార్దూల్తో పాటు మహీంద్ర థార్ వాహనాలను సుందర్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవదీప్ సైనీలు కూడా అందుకున్నారు.
|
మహింద్రాకు రిటర్న్ గిఫ్ట్
'భారత్ తరఫున క్రికెట్ ఆడే అవకాశం రావడం నా జీవితంలోనే నాకు దక్కిన గొప్ప వరం. నాకు దక్కుతున్న ఈ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు నన్ను కట్టిపడేస్తున్నాయి. అద్భుతమైన వ్యక్తుల నుంచి మద్దతు, ప్రోత్సాహం లభిస్తుంది. ఆనంద్ మహింద్రా గారు నాకు బహుమతిగా ఇచ్చిన మహింద్రా థార్ వాహనాన్ని ఈ రోజే నడిపాను.
నా ప్రయాణాన్ని గుర్తించి నాకు అండగా నిలిచిన శ్రీ ఆనంద్ మహింద్రా గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రికెట్పై మీకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది సార్. మీ కోసం నా అరంగేట్ర టెస్ట్ అయిన గబ్బా మ్యాచ్లోని జెర్సీని నా సంతకంతో పంపిస్తున్నాను. 'అని నట్టూ ట్వీట్ చేశాడు.
నట్టూ.. నీ జెర్సీని గర్వంగా ధరిస్తా..
ఇక నటరాజన్ రిటర్న్ గిఫ్ట్పై స్పందించిన ఆనంద్ మహీంద్రా.. యార్కర్ల కింగ్కు ధన్యవాదాలు తెలిపాడు. నట్టూ జెర్సీని అపురూపంగా దాచుకుంటానని, గర్వంగా ధరిస్తానని ట్వీట్ చేశాడు. థ్యాంక్యూ నట్టూ.. ఈ జెర్సీని బంగారంలా దాచుకుంటా. గర్వంగా వేసుకుంటా.'అని మహీంద్రా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్లు ఆటగాళ్ల ఎస్యూవీ కార్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
నటరాజన్తో పాటు..
ఆస్ట్రేలియా పర్యటనలో సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా 'థార్ ఎస్యూవీ' కార్లను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. సుందర్తో పాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్, నవదీప్ సైనీ, టీ నటరాజన్లకు మహీంద్రా కార్లను ఇచ్చారు.
సిరాజ్ నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీయగా.. నటరాజన్ అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన చేశాడు. సుందర్ (62), శార్దూల్ (66) నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకాలతో రాణించారు. శుభ్మన్ గిల్ ఓపెనర్గా రాణించాడు. సైనీ తనవంతు పాత్ర పోషించాడు. దాంతో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో సగర్వంగా సొంతం చేసుకుంది.