
భారత్దే టైటిల్..
'నా అంచనా ప్రకారం ఆసియాకప్ విన్నర్ భారత్. ఆ జట్టు చాలా బలంగా ఉండటమే కాకుండా పరిస్థితులను త్వరగా అడాప్ట్ చేసుకుంటుంది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే తొలి మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే భారత్ ఓడించే సత్తా తమకు ఉందనే ఆత్మవిశ్వాసంతో పాక్ బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టే ఆసియా కప్ గెలిచే అవకాశం ఉంది. నా స్ట్రాంగ్ ఫీలింగ్ మాత్రం భారతే గెలుస్తుందనిపిస్తుంది. ఆ జట్టు బ్యాటింగ్లో చాలా ఫైర్ పవర్ ఉంది. కాబట్టి ఆ జట్టును ఓడించడం అంత సులువైన పని కాదు.'అని వాట్సన్ చెప్పుకొచ్చాడు.

ఒక్క ఇన్నింగ్స్ చాలు..
కోహ్లీ రీఎంట్రీ షేన్ వాట్సన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. కోహ్లీ మానసికంగా, శారీరకంగా నూతనోత్సాహంతో ఉన్నాడని అభిప్రాయపడ్డాడు. 'ఐపీఎల్ 2021 సీజన్లోనే కోహ్లీ తన శక్తిని కోల్పోయినట్లు అనిపించాడు. వరుసగా క్రికెట్ ఆడటంతో చాలా అలసిపోయినట్లు కనిపించాడు. ఈ క్రమంలో నెల రోజులు ఆటకు దూరంగా ఉన్న కోహ్లీ ఆసియా కప్లోకి దిగుతున్నాడు. మరో యాభై రోజుల్లో ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.
అందుకే విరాట్ వంటి నాణ్యమైన ఆటగాడు ఫామ్లోకి రావాలంటే తప్పనిసరిగా విశ్రాంతి అవసరం. అప్పుడే మరింత చురుగ్గా ఆడగలడు. ఫామ్ అందుకోవాలంటే కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఆసియా కప్లో రాణిస్తాడనే విశ్వాసం ఉంది'' అని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

సెంచరీ లేక మూడేళ్లు..
ఆగస్ట్ 28న ఆసియా కప్లో తమ తొలి మ్యాచ్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడతాయి. ఆటకు విరామం తీసుకుని మైదానంలోకి అడుగు పెడుతున్న విరాట్ ఎలా ఆడతాడో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే. 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు. అయితే అడపాదడపా అర్ధశతకాలు సాధించినా తన స్థాయి ఆటను మాత్రం ప్రదర్శించలేకపోయాడు. విండీస్, జింబాబ్వే పర్యటనలకు దూరంగా ఉన్న కోహ్లీ విశ్రాంతి తీసుకుని ఆసియా కప్లో ఆడనుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.


Click it and Unblock the Notifications












