'కశ్మీర్ అవర్:
ఈ నెల 30వ తేదీన శుక్రవారం 12 గంటలకు 'కశ్మీర్ అవర్' పేరిట సంఘీభావం కోసం సైరన్ మోగిస్తాం. ఈ నిరసన కార్యక్రమంలో పాక్ ప్రజలందరూ పాల్గొనాలని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. పాక్ ఆర్మీ ప్రకటన అనంతరం కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా చేపట్టనున్న నిరసనలో తాను కూడా పాల్గొంటానని షాహిద్ అఫ్రీది ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
|
ప్రధాని ఖాన్ పిలుపుకు మద్దతు ఇద్దాం:
'ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుకు మద్దతు ఇద్దాం. శుక్రవారం మధ్యా హ్నం 12 గంటలకు మజర్ ఈ ఖైద్ (జిన్నా సమాధి)ని సందర్శిస్తా. కశ్మీరీ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు నాతో చేతులు కలపండి. సెప్టెంబర్ 6న ఓ అమర జవాన్ ఇంటికి వెళతా. త్వరలో ఎల్వోసీకి కూడా వెళతా' అని అఫ్రిదీ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. కశ్మీర్కు సంఘీభావంగా పాక్ ఆర్మీ నిరసనలో రేపు అఫ్రిదీ పాల్గొననున్నాడు.
ఆర్టికల్ 370ని రద్దు:
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదాను తొలిగించి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ఈ నెల ఆరంభంలో విభజించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్పై పాక్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. చివరకు క్రికెట్ ఆటగాళ్లు కూడా.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. శుబ్మన్ గిల్పైనే అందరి దృష్టి