|
మీ సపోర్ట్ విలువైనది..
‘మద్దతు తెలిపిన నా బ్రదర్స్ యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్కు ధన్యవాదాలు. మీ మద్దతు నాకు ఎంతో విలువైనది. మన మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని చాటిచెబుతోంది. యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్కు అభినందనలు'అని ట్వీట్ చేశారు.
పాకిస్థాన్లో కరోనాపై పోరాడేందుకు షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మందులు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాడు. దీంతో అతడు చేస్తున్న సేవలకి యువరాజ్, భజ్జీతోసహా పలు క్రికెటర్లు మద్దతు పలుకుతున్నారు. అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
వీలైనంత సాయం చేద్దాం..
'ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా అభాగ్యుల కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం. షాహిద్ అఫ్రిదీ, అఫ్రిదీ ఫౌండేషన్కు నా మద్దతు ఉంటుంది. కోవిడ్-19 కట్టడికి అతను ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. దయచేసి ఆ సంస్ధకు విరాళాలు ఇవ్వండి'అని యూవీ, భజ్జీ విజ్ఞప్తి చేశారు. ఇక షోయబ్ అక్తర్ కూడా అఫ్రిది చేస్తున్న పనిని కొనియాడుతూ విరాళాలు ఇవ్వాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
హిందువులు.. క్రిస్టియన్లకు
ముస్లిం రాజ్యం అయిన పాకిస్థాన్లో మాములు సమయంలోనే ఇతర మతాల ప్రజలకు దక్కే గౌరవం చాలా తక్కువ. వారిని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోదు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితిలో వారి బతుకు అగమ్యగోచరం. కానీ అఫ్రిదీ అందరూ సమానమే.. మతం కన్నా మానవత్వమే గొప్పా అని చాటాడు. తన స్వచ్చంద సంస్థ ద్వారా క్రిస్టియన్లు, హిందువులకు బియ్యం అందజేశాడు. గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తు అందరి మన్ననలు అందుకుంటున్న అఫ్రిది ఈ రోజు మరో మెట్టు ఎక్కాడు.