నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు:
సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్లో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 9 వరకు లంక పాక్లో పర్యటించాల్సి ఉంది. పర్యటనలో భాగంగా ఈ నెల 27 నుంచి మూడు వన్డేలు, అనంతరం అక్టోబరు 5 నుంచి మూడు టీ20 మ్యాచ్ల్ని శ్రీలంకతో ఆడేలా పాకిస్థాన్ షెడ్యూల్ రూపొందించింది.
ఆటగాళ్లతో సమావేశం:
ఈ పర్యటన నేపథ్యంలో లంక బోర్డు సోమవారం ఆటగాళ్లతో సమావేశం అయింది. పాక్కు వెళ్లవద్దు అనుకుంటే ప్లేయర్లు తమ అయిష్టాన్ని వ్యక్తం చేయవచ్చు అని బోర్డు చెప్పింది. లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్కు వెళ్లేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మొతం 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించారట.
భద్రతా కారణాల రీత్యా:
భద్రతా కారణాల రీత్యా లంక ఆటగాళ్లు ఈ సిరీస్ ఆడటానికి ఒప్పుకోలేదు. స్వయంగా శ్రీలంక క్రీడల మంత్రి సీనియర్ క్రికెటర్లని పిలిపించి మాట్లాడినా.. వారు ఒప్పుకోలేదని సమాచారం తెలుస్తోంది. నిరోషన్ డిక్విల్లా, కుశల్ పెరీరా, ధనంజయ డిసిల్వ, తిషార పెరీరా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చందీమల్ కూడా పాక్ టూర్ టూర్ను బహిష్కరించారట.
భారత్ vs దక్షిణాఫ్రికా: 15 నుంచి వైజాగ్ టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం
2009లో దాడులు:
2009లో శ్రీలంక జట్టు పాక్లో పర్యటించినప్పుడు వారిపై దాడులు జరిగాయి. ఆ సమయంలో బస్సులో ఉన్న లంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత పాక్లో ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరగలేదు. మళ్లీ లంక జట్టుతో పాక్లో క్రికెట్ను పునరుద్ధరించాలని భావిస్తున్నారు. కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. పాకిస్థాన్ గత 10 ఏళ్ల కాలంలో మ్యాచ్లను యూఏఈలోనే ఆడుతోన్న విషయం తెలిసిందే.