
విశ్రాంతి తీసుకోవడం బెటర్..
అయితే ఈ ఆలోచన తీరును స్కాట్ స్టైరిస్ తప్పుబట్టాడు. దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని కొట్టిపడేశాడు.'విరాట్ కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా ఉండటం మంచిదే. అదేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. అయితే జింబాబ్వేతో వన్డేలు ఆడేందుకు విరాట్ కోహ్లీని పంపించాలని కొందరు చెబుతున్నారు. జింబాబ్వేపై కోహ్లీ అలవోకగా సెంచరీ కొట్టగలడు. కానీ అతనికి పెద్దగా ప్రయోజనం ఉండదు. జింబాబ్వేను తక్కువ చేయడం కాదు. కోహ్లీ మళ్లీ ఫామ్లోకి రావాలంటే జింబాబ్వేతో ఆడాల్సిన అవసరం లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నేను చెబుతా'అని స్టైరిస్ సూచించాడు.

క్లారిటీ ఇవ్వాలి..
టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యేలోపు పూర్తి సన్నద్ధంగా ఉండేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని టీమిండియా మాజీ ఆటగాడు సబా కరీం తెలిపాడు. అదేక్రమంలో విరాట్ కోహ్లీ విలువేంటో రోహిత్, రాహుల్ ద్రవిడ్కు తెలుసునని చెప్పాడు. ''ప్రపంచకప్ జట్టులోకి విరాట్ను తీసుకునే ఆలోచన యాజమాన్యంతోపాటు సెలెక్టర్లకు ఉందో లేదో స్పష్టతనివ్వాలి. జట్టు విజయానికి కోహ్లీ అవసరమని భావించిన తర్వాత.. విరాట్ ఫామ్లోకి రావడానికి నా దగ్గర ఓ మార్గం ఉంది.'అని కరీం చెప్పుకొచ్చాడు.

ఆడాలని ఉంటే పంపించండి..
'జింబాబ్వేతో మ్యాచ్లు ఆడాలని నేను ఆదేశించను. అక్కడ ఆడితేనే ప్రపంచకప్కు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పను. ఆడాలని భావిస్తే వెళ్లు ఆడు. లేకపోతే విరామం తీసుకుంటానని చెబితే అలానే చేయ్. ఆసియా కప్ వరకు విశ్రాంతి తీసుకో' అని కోహ్లీకి చెబుతా'' అని మాజీ సెలెక్టర్ సబా కరీం వ్యాఖ్యానించాడు. ఒకవేళ జింబాబ్వేతో ఆడినప్పుడూ విఫలమైతే కోహ్లీని జట్టు నుంచి తప్పించడం పెద్ద తప్పిదమవుతుందని కరీం అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications












