ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కేకేఆర్ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేకేఆర్లోకి ఆమన్ ఖాన్ ప్లేస్లో శివం మావి ఎంట్రీ ఇవ్వగా.. రాజస్థాన్ జట్టులోకి డస్సెన్, కుల్దీప్ సేన్, నీషమ్ స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్, కరుణ్ నాయర్, ఒబెడ్ మెక్కాయ్ వచ్చారు. ఇక టాస్ ఓడిన సంజూ శాంసన్.. తాము కూడా ముందు ఫీల్డింగ్ చేయాలనుకున్నామని చెప్పాడు. ఈ సీజన్లో ఈ మైదానంలో ఆడటం ఇదే తొలిసారని, కండిషన్స్ బట్టే జట్టులో మార్పులు చేసామని చెప్పాడు.
గాయం నుంచి కోలుకోవడంతో ట్రెంట్ బౌల్ట్ తుది జట్టులోకి వచ్చాడని, బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపెతం చేసేందుకు కరుణ్ నాయర్ను తీసుకున్నామని తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. అలానే ఏ సవాల్కైనా సిద్దంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఈ మైదానం మాకు కొత్త. ఇక్కడి పరిస్థితులను వీలైనంత త్వరగా మేం అర్థం చేసుకోవాలి. జట్టుకు కావాల్సింది ప్రతీ ఒక్కరూ అందిస్తున్నారు. పరిస్థితులను అర్థం చేసుకొని స్మార్ట్గా ఆడాలని నిర్ణయించుకున్నాం. అదే విధంగా తప్పిదాలను కూడా స్వీకరించాలనుకున్నాం. సానుకూల ధృక్పథంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాం. 'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచిన అయ్యర్.. మైదాన పరిస్థితులను ఉద్దేశించే చేజింగ్కు మొగ్గు చూపానన్నాడు. ఒక సైడ బౌండరీ చిన్నగా మరోవైపు పెద్దగా ఉందన్నాడు. ఈ మైదానాన్ని ఉద్దేశించి నెట్స్లో తీవ్రంగా శ్రమించామని చెప్పాడు. ఇక్కడ జరిగిన గత మ్యాచ్ల వీడియోలను చూసి కొంత హోమ్ వర్క్ కూడా చేశామని, మీటింగ్స్లో మాట్లాడింది అమలు పరచడం చాలా ముఖ్యమని తెలిపాడు.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్(కీపర్, కెప్టెన్), కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్, యుజ్వేంద్ర చాహల్
కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్(కీపర్), సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, శివం మావి, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ