
సంజూ వచ్చి ఉంటే..
‘సంజూ శాంసన్ మూడో స్ధానంలో బ్యాటింగ్కు సిద్దంగా ఉండగా... అశ్విన్ను పంపాల్సిన అవసరం ఏముంది. బట్లర్ దూకుడుగా ఆడుతున్నప్పడు.. అతని జోడీగా మూడో స్థానంలో సంజూ శాంసన్ వచ్చి ఉంటే బాగుండేది. అశ్విన్ను ఆ స్థానంలో హిట్టింగ్ కోసం పంపారని నేను అనుకుంటున్నా. కానీ అది అవసరం లేదు. లక్ష్యం 215 పరుగులు పైగా ఉంటే ఇటువంటి ప్రయోగాలు చేసినా పర్వాలేదు.

అశ్విన్ అవసరమా?
కాగా ఒకరిని బ్యాటింగ్ పంపేటప్పుడు అతనికి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉందా? లేదా? అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. బట్లర్ ఇన్నింగ్స్ను అద్భుతంగా ప్రారంభించాడు. అటువంటి సమయంలో రాజస్థాన్ ఇటువంటి నిర్ణయం ఎందకు తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఒక చెత్త నిర్ణయం. ఈ ప్రయోగం జట్టు ఓటమికి కారణమైంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

బట్లర్ చెలరేగినా..
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కెప్టెన్ హార్దిక్ పాండ్యా (52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 నాటౌట్) చివరి దాకా నిలబడి పరుగులు సాధించగా, అభినవ్ మనోహర్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 43) రాణించాడు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసి ఓడింది. జోస్ బట్లర్ (24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) చెలరేగాడు. ఫెర్గూసన్ (3/23) కీలక వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications













