
స్లిప్ క్యాచ్ వదలడంతో..
తాజాగా స్పోర్ట్స్ కీదాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్పై చాపెల్ అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశాడని గుర్తు చేసుకున్నాడు. కోచ్ ప్రవర్తన పట్ల లక్ష్మణ్ షాక్కు గురయ్యాడని చెప్పుకొచ్చాడు. '2005లో జింబాబ్వే పర్యటన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. గాయం కారణంగా వీవీఎస్ లక్ష్మణ్ మైదానం వీడాడు. అతని స్థానంలో మైదానంలోకి దిగిన సబ్స్టిట్యూట్ ప్లేయర్ స్లిప్స్లో ఓ క్యాచ్ను జారవిడిచాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చాపెల్.. అక్కడ ఫీల్డింగ్ చేయాల్సిన లక్ష్మణ్ ఎందుకు లేడంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు'అని నాటి సంఘటనను మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు.

చనిపోయేంత గాయమా?
ఆ టైమ్లో వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్లో కాఫీ తాగుతున్నాడని, అతని దగ్గరికి వచ్చి చాపెల్ అనరాని మాటలు అన్నాడని మంజ్రేకర్ తెలిపాడు. 'ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో కాఫీ తాగుతున్న వీవీఎస్ లక్ష్మణ్ను ఫీల్డ్ నుంచి ఎందుకు వచ్చావంటూ చాపెల్ ప్రశ్నించాడు. గాయం కారణంగా మైదానం వీడానని, ఐస్ పెట్టుకోవడానికి వచ్చానని లక్ష్మణ్ బదులిచ్చాడు. అయినప్పటికీ.. అదేమైనా అంత ప్రాణాపాయమైన గాయమా? అని గ్రెగ్ చాపెల్ అసహనం వ్యక్తం చేశాడు. అలాంటి సందర్భం వస్తే కానీ.. మైదానంలో నుంచి బయటకు రావద్దని మందలించాడు. దాంతో లక్ష్మణ్ షాక్కు గురయ్యాడు.'అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.

స్థంభించిన భారత పార్లమెంట్..
భారత క్రికెట్లోనే ఓ విప్లవం తీసుకొచ్చిన దాదా.. 2005లో చాపెల్ కారణంగా కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీతో పాటు జట్టులో చోటునే కొల్పోయాడు. గంగూలీని తప్పించాలని బీసీసీఐకి చాపెల్ రాసిన మెయిల్ లీకవ్వడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. భారత పార్లమెంట్ను కూడా స్థంభింపచేసింది. అనంతరం సత్తా చాటిన దాదా 2006లో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ జట్టు పగ్గాలను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక చాపెల్ ప్రయోగాలు బెడిసి కొట్టడంతో 2007 ప్రపంచకప్లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటకుండా ఇంటిదారిపట్టింది.


Click it and Unblock the Notifications












