For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టెస్టుల్లో కీపింగ్ స్కిల్స్‌కే మొదటి ప్రాధాన్యత.. నా ఓటు ఎప్పుడూ సాహాకే'

Sanjay Manjrekar picks Wriddhiman Saha Over Rishabh Pant to keep wickets

సిడ్నీ: సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ తిరిగిరానున్నాడు. ఇక స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మూడో టెస్టుకు అందుబాటులో రానున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎప్పటికీ ఆడే జట్టుతో కాకుండా.. పలువురికి అవకాశాలు ఇచ్చే సూచనలు ఉన్నాయి.

ఇద్దరు వికెట్ కీపర్లు:

టెస్ట్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నారు. అయితే ఇద్దరూ బ్యాటింగ్‌లో నిలకడగా రాణించడంలో విఫలమవుతున్నారు. ఇక కీపింగ్‌లో మాత్రం పంత్‌తో పోలిస్తే సాహా అత్యుత్తమం. ఇదే విషయాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో పంత్‌కు బదులు సాహాని ఆడించాలని సూచించాడు. మంజ్రేకర్ తాజాగా ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.

నా ఓటు సాహాకే:

నా ఓటు సాహాకే:

మొదటి టెస్టుకు టీమిండియా వికెట్ కీపర్‌గా ఎవరు ఆడితే బాగుంటుంది అని ఓ అభిమాని అడిగాడు. దానికి సంజయ్ మంజ్రేకర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. 'టెస్టుల్లో ఎప్పుడూ కీపింగ్ స్కిల్స్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకో ఓ ఉదాహరణ చెపుతా.. ఒకవేళ స్టీవ్‌ స్మిత్ క్యాచ్‌ని ఆరంభంలో కీపర్ చేజారిస్తే అతను డబుల్ సెంచరీ చేస్తాడు. కాబట్టి కీపర్‌గా వృద్ధిమాన్ సాహాని ఆడిస్తే బాగుంటుంది. పేస్‌ పిచ్‌లు ఉండే ఆస్ట్రేలియాలో బెటర్ కీపర్ ఉండాలి. అందుకే నా ఓటు సాహాకే' అని సంజయ్ స్పష్టం చేశాడు.

నిలకడగా రాణిస్తున్న సాహా:

నిలకడగా రాణిస్తున్న సాహా:

2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ కీపర్‌గా అవకాశం దక్కించుకున్న రిషబ్ పంత్.. టెస్టు సిరీస్‌లో సెంచరీ చేశాడు. కానీ 2019లో సొంతగడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో వరుసగా సాహాకే టీమిండియా మేనేజ్‌మెంట్‌ అవకాశమిచ్చింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ సాహా నిలకడగా రాణించగా.. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా కీపర్‌గానూ పంత్ విఫలమయ్యాడు. దాంతో తొలి టెస్టులో సాహానే ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. కేఎల్ రాహుల్ వన్డే, టీ20లలో కీపర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా:

ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20, వన్డే సిరీస్‌ల్లోనూ టీమిండియా రిషబ్ పంత్‌ను ఆడించలేదని, దాంతో ఇప్పటి వరకు ఆస్ట్రేలియాకు అతడో పర్యాటకుడిలా వెళ్లాడని ఆకాష్ చోప్రా విమర్శించాడు. పంత్ ఇలానే జట్టుతో కొనసాగడం కూడా ఓ సమస్యగా మారనుందని తెలిపాడు. పంత్‌ అలాగే జట్టుతో కొనసాగితే.. వృద్ధిమాన్ సాహాకు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మిగిలిపోతాడని.. దాంతో అటు టీమిండియాకు, ఇటు దేశవాళీ ఆడే అవకాశం కోల్పోతాడని చోప్రా చెప్పాడు. 2021 ఐపీఎల్‌ అయ్యేంత వరకు అతడు మళ్లీ జాతీయ జట్టులో కనపడే అవకాశం లేదని జోస్యం చెప్పాడు.

వైరల్ ఫొటో.. జ్వాలా గుత్తా, విష్ణు విశాల్ రొమాంటిక్ క్లిక్!!

Story first published: Saturday, December 12, 2020, 16:24 [IST]
Other articles published on Dec 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+