
ముంబై: భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. దేశంలో జరిగే ప్రతీ ఘటనపై తనదైన శైలిలో స్పందించే సచిన్.. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు క్రికెట్ పరిభాషను ఉపయోగించడంలోను దిట్ట. కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎన్నో ట్వీట్లు చేసిన సచిన్.. తాజాగా తాను లాక్డౌన్ను ఎలా ఆస్వాదిస్తున్నానో తెలియజేశాడు.
2013లో తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. క్రికెట్లో వంద అంతర్జాతీయ సెంచరీలతో పాటు అత్యధిక పరుగులు చేసిన ఘనతను అందుకున్నాడు. తన ఆటతో దేశానికి పేరు తేవడమే కాకుండా ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచాడు. ఇక కరోనా క్వారంటైన్ సమయాన్ని సచిన్ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. ఇక కరోనా వైరస్ కట్టడికి తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. అలాగే ఓ స్వచ్చంద సంస్థతో కలిసి ఐదు వేల కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందించాడు.