ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 67) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ముంబై ముందు రాజస్థాన్ 159 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. బట్లర్కు తోడుగా రవిచంద్రన్ అశ్విన్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 21) రాణించాడు. ముంబై బౌలర్లలో హృతిక్ షోకీన్, రిలే మెరిడిత్ రెండేసి వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, కుమార్ కార్తికేయ తలో వికెట్ పడగొట్టారు.
ఓపెనర్లు జోస్ బట్లర్, పడిక్కల్(15) నిదానంగా ఇననింగ్స్ ప్రారంభించాడు. పడిక్కల్ ఇచ్చిన లాలిపాప్ క్యాచ్ను టీమ్ డేవిడ్ నేలపాలు చేశాడు. అయినా ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేపోయాడు. హృతిక్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. ఆ వెంటనే సంజూ శాంసన్(16)ను కార్తీకేయ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్ డానియల్ సామ్స్ పెవిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జోస్ బట్లర్ ధాటిగా ఆడే క్రమంలోనే హృతిక్ బౌలింగ్లో వెనుదిరిగాడు. రియాన్ పరాగ్(3) సైతం విఫలమవ్వడంతో స్వల్ప స్కోర్కే పరిమితం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అశ్విన్ ధాటిగా ఆడి 150 పరుగుల మార్క్ ధాటించాడు.