
ముంబై: రాజస్థాన్ రాయల్స్ నయా కెప్టెన్ సంజూ శాంసన్ తన మార్క్ వికెట్ కీపింగ్తో ఔరా అనిపించాడు. స్పైడర్ మ్యాన్లా గాల్లో తేలుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సంజూ వికెట్ల వెనుకాల తన సూపర్ ఫీల్డింగ్ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ క్యాచ్కు బిత్తరపోయిన ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. సంజూ స్టన్నింగ్ క్యాచ్తో మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్స్ సైతం అవాక్కయ్యారు. వాటే క్యాచ్ అంటూ కొనియాడారు.
ఢిల్లీ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతిని జయదేవ్ ఉనాద్కత్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్గా వేయగా.. శిఖర్ ధావన్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకెళ్లగా.. కీపర్ సంజూ శాంసన్ స్పైడర్ మ్యాన్లా గాల్లో తేలుతు బంతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టన్నింగ్ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. శాంసన్ వికెట్ కీపింగ్ స్కిల్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పక్షివా? సూపర్ మ్యాన్వా? అంటూ కామెంట్ చేస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఈ సీజన్లో అత్యధిక ధర పలికిన క్రిస్ మోరీస్(18 బంతుల్లో 4 సిక్స్లతో 36 నాటౌట్) ధనాధన్ హిట్టింగ్తో 3 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ ఐపీఎల్ 2021 సీజన్లో బోణీ కొట్టింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 రన్స్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(32 బంతుల్లో 9 ఫోర్లతో 52)మినహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనాద్కత్ మూడు, ముస్తాఫిజుర్ రెండు, మోరిస్ ఓ వికెట్ తీశారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసిన రెండు బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. డేవిడ్ మిల్లర్(43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు, రబడా, క్రిస్ వోక్స్ రెండేసి వికెట్లు తీశారు.