
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ స్లాట్ కోసం శిఖర్ ధావన్తో పాటు డేవిడ్ వార్నర్పై ఆర్సీబీ కన్నేసింది. డేవిడ్ వార్నర్ కోసం భారీ ధర వెచ్చిచ్చేందుకు కూడా ఆర్సీబీ సిద్దంగా ఉంది. వార్నర్ను తీసుకుంటే కెప్టెన్సీ లోటు కూడా తీరుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. శిఖర్ ధావన్ కోసం గట్టిగానే ప్రయత్నించాలనుకుంటుంది.
వార్నర్ దొరకకపోతే.. జానీ బెయిర్ స్టోలను తీసుకోవాలనుకుంటుంది. విరాట్ కోహ్లీ ఓపెనర్గానే కొనసాగించాలనుకుంటే మరో ఓపెనర్ను తీసుకోకపోవచ్చు. బ్యాకప్ ఆప్షన్స్గా యువ ఆటగాళ్లను ఎంచుకునే చాన్సుంది.

మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మలాన్
ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ను ఫస్ట్ టార్గెట్గా ఆర్సీబీ పెట్టుకుంది. డేవిడ్ వార్నర్ వేలంలో దొరకకపోతే.. అయ్యర్ కోసం రూ. 20 కోట్లు పెట్టడానికైనా ఆర్సీబీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. కెప్టెన్గా అయ్యర్ పనికొస్తాడని ఆ జట్టు భావిస్తోంది. అయితే అయ్యర్కు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో అతను దొరకకపోతే.. ఇషాన్ కిషన్ తీసుకోవాలనుకుంటుంది. అలాగే డేవిడ్ మలాన్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, నికోలస్ భరత్లను టార్గెట్ చేయాలనుకుంటుంది.

పేసర్లుగా కమిన్స్, రబడా
జట్టు పేసర్లుగా ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, నటరాజన్, క్రిస్ జోర్డాన్లను ఆర్సీబీ టార్గెట్గా పెట్టుకుంది. వేలానికి భారీ డబ్బే ఉండటంతో స్టార్ ప్లేయర్లకు ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తోంది. అయితే కమిన్స్, రబడా వంటి ఆటగాళ్లు రూ. 15 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది కాబట్టి భారత పేసర్లే ఆర్సీబీకి దక్కే చాన్సుంది.
నటరాజన్, ప్రసిధ్ కృష్ణలను కొనుగోలు చేసే చాన్సుంది. స్పిన్నర్లుగా యుజ్వేంద్ర చాహల్ను మళ్లీ తీసుకునేందుకు ఓ మోస్తారు ధర వరకు ఆర్సీబీ ప్రయత్నించనుంది. రాహుల్ చాహర్, వాషింగ్టన్ సుంధర్, నాథన్ లయన్ వంటి స్పిన్నర్లును బ్యాకప్ ఆప్షన్గా పెట్టుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు(అంచనా)
డేవిడ్ వార్నర్/శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, గ్లేన్ మ్యాక్స్వెల్, మిచెల్ మార్ష్/ నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, వానిందు హసరంగా, ప్యాట్ కమిన్స్/కగిసో రబడా/ మార్క్ వుడ్, ఖలీల్ అహ్మద్, రాహుల్ చాహర్, మహమ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ, ప్రసిధ్ కృష్ణ, జగదీష్ సుచిత్, అశ్విన్ హెబ్బర్, తన్మయ్ అగర్వాల్, తిలక్ వర్మ


Click it and Unblock the Notifications
