
కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 96 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 2422 పరుగులు చేయగా... 69 మ్యాచ్ల్లో 2310 పురుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ (76 మ్యాచ్ల్లో 2272 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు
నాలుగు సెంచరీలతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఇక, టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం రోహిత్ శర్మ అధిగమించాడు. టీ20ల్లో విరాట్ కోహ్లీ 20కిపైగా హాఫ్ సెంచరీలు చేయగా... రోహిత్ శర్మ 21 హాఫ్ సెంచరీలు(17 హాఫ్ సెంచరీలు+4 సెంచరీలు)తో అగ్రస్థానంలో నిలిచాడు.
రెండు ఇన్నింగ్స్ల్లోనూ సెంచరీ.. స్మిత్ అరుదైన రికార్డు

టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్
మొత్తంగా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా సురేశ్ రైనా (8369)ను విరాట్ కోహ్లీ(8393) అధిగమించాడు. విండిస్తో ఆదివారం జరిగిన రెండో టీ20లో విరాట్ కోహ్లీ 23 బంతుల్లో 28 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సురేశ్ రైనా రికార్డుని కోహ్లీ అధిగమించాడు. దీంతో పాటు అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ ఫోర్లు బాదిన ఆటగాడిగా కోహ్లీ (225). దిల్షాన్ (223)ను అధిగమించాడు.


Click it and Unblock the Notifications












