ముంబై: ఆస్ట్రేలియాతో జరిగే పింక్బాల్ టెస్ట్ తమకు పెద్ద సవాల్తో కూడుకున్నదని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత్ అక్కడ ఆ జట్టుతో నాలుగు టెస్ట్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ టూర్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నాలుగు టెస్ట్ల సిరీస్లో ఓ మ్యాచ్ ఫ్లడ్ లైట్స్ కింద జరగనుంది.
డిసెంబర్ 11 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ జనవరి 3 వరకు జరగనుంది. బ్రిస్బెన్, అడిలైడ్, మెల్బోర్న్, సిడ్నీలును ఈ సిరీస్ వేదికలుగా సీఏ ఖారారు చేసింది. ఇక కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన రోహిత్ శర్మ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్తో చిట్చాట్ చేశాడు.
ఈ సందర్బంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆస్ట్రేలియా వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్ గురించి ప్రస్తావించాడు. ఆ మ్యాచ్కు ఎలా సిద్దమవుతున్నారని కూడా ప్రశ్నించాడు. దీనికి రోహిత్.. ఆ మ్యాచ్ పక్కా తమకు సవాల్ అవుతుందని బదులిచ్చాడు. ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ క్రికెటర్ జాసన్ రాయ్ ఆటను తాను ఆస్వాదిస్తానన్నాడు.