
మీరు అతిచేయడం ఆపండి..
ఈ క్రమంలోనే మూడు టీ20ల సిరీస్కు ముందు మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ.. తన సహచర ఆటగాడికి మద్దతుగా మాట్లాడాడు. కోహ్లీ ఫామ్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా గట్టిగా కౌంటరిచ్చాడు. 'మీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నా... మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? విరాట్ కోహ్లీబాగున్నాడు. తను మానసికంగా ఎంతో బలవంతుడు. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వ్యక్తికి ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు. నిజానికి ఇదంతా మీ వల్లే మొదలైంది. మీరు సైలెంట్గా ఉంటే అంతా బాగానే ఉంటుంది'అంటూ చురకలంటించాడు.

ఐపీఎల్ ప్రభావం ఉండొద్దు..
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ప్రభావం టీమిండియా ప్రయోజనాలపై పడకూడదని రోహిత్ శర్మ ఆటగాళ్లను హెచ్చరించాడు. ఐపీఎల్లో ఏ జట్టుకు ఆడుతున్నారు? ఎన్నో స్థానంలో బ్యాటింగ్కు దిగుతున్నారు? అన్న అంశాలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. భారత్ తరఫున ఆడేటపుడు జట్టు అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

టీమిండియాకే ప్రియారిటీ..
'వేలం ముగిసింది. భావోద్వేగాలకు గురికావడం సహజం. అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడు దృష్టి మొత్తం విండీస్తో సిరీస్పైనే ఉండాలి. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నిన్న మాట్లాడాం. రానున్న రెండు వారాలు ఎంతో ముఖ్యం. బ్లూ జెర్సీలో ఆడుతున్నపుడు ఎలా ఉండాలో మరోసారి గుర్తు చేశాం. నిజానికి వాళ్లంతా ప్రొఫెషనల్స్. అయితే, మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయా ఫ్రాంఛైజీలకు ఆడుతున్నపుడు బాధ్యతలు వేరుగా ఉంటాయి. టీమిండియాకు ఆడేటపుడు అలా ఉండదు. ప్రస్తుతం జాతీయ జట్టు కూర్పుపైనే మా దృష్టి'' అని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్తో కోల్కతా వేదికగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుండగా.. తొలి మ్యాచ్ బుధవారం జరగనుంది.


Click it and Unblock the Notifications
