For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రోహిత్ శర్మ

చెన్నై: విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తోనే వన్డే ప్రపంచకప్ 2023లో శుభారంభం చేసామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. ఈ గెలుపు క్రెడిట్ కోహ్లీ, రాహుల్‌దేనని స్పష్టం చేశాడు. చేజింగ్‌లో టీమిండియాకు దక్కిన ఆరంభం చూసి భయపడ్డానని, కోహ్లీ, రాహుల్ సూపర్ పార్ట్‌నర్‌షిప్‌తో జట్టుకు విజయాన్నందించారని కొనియాడాడు.

'బౌలింగ్, ఫీల్డింగ్‌లో మేం అద్భుత ప్రదర్శన కనబర్చాం. ఈ రెండు విభాగాల్లో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చాం. కఠిన పిచ్‌పై బ్యాటర్లకు పరుగులివ్వకుండా కట్టడి చేశాం. ఈ వికెట్ స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలంగా ఉంది. సీమర్స్‌కు రివర్స్ స్వింగ్ అయ్యింది. మా బౌలర్లు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేశారు. సమష్టి ప్రదర్శన కనబర్చారు.

Rohit Sharma says credit to Virat Kohli and KL Rahul after India beat Australia in World Cup 2023

బ్యాటింగ్‌లో మేం ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయాం. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం చూసి నేను ఆందోళనకు గురయ్యా. చేజింగ్‌లో ఇలాంటి ఆరంభాలు అస్సలు ఉండకూడదు. ఆసీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీసారు. ఇందులో చెత్త షాట్లు కూడా ఉన్నాయి. అయితే పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో ఈ తరహా తప్పిదాలు జరగడం సహజం.

విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు హ్యాట్సాఫ్. తీవ్ర ఒత్తిడిలో అసాధారణ భాగస్వామ్యంతో జట్టు విజయానికి బాటలు వేసారు. ఇక తదుపరి వేదికపై ఆడటం మాకు సవాల్‌తో కూడుకున్నది. ఈ టోర్నీలో మాకు అతిపెద్ద సవాల్ కూడా ఇదే. దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో భిన్నమైన పరిస్థితుల్లో ఆడాల్సి ఉంది. టీమ్ కాంబినేషన్ కూడా మారొచ్చు.

ఓ జట్టుగా ఈ సవాల్‌కు మేం సిద్దంగా ఉన్నాం. చెన్నై అభిమానులు ఎప్పుడూ నిరాశపరచరు. తీవ్ర ఉక్కపోత మధ్యలో కూడా మ్యాచ్‌కు హాజరై మాకు అండగా నిలిచారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(116 బంతుల్లో 6 ఫోర్లతో 85), కేఎల్ రాహుల్(115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 97 నాటౌట్) చెలరేగారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్ ఓ వికెట్ తీసాడు.

Story first published: Monday, October 9, 2023, 6:15 [IST]
Other articles published on Oct 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+