ముంబై: కరోనా లాక్డౌన్తో గత మూడు నెలలుగా ఆంక్షలు, నిర్భంధాలు, భౌతిక దూరాలు.! అయినా వైరస్ వ్యాప్తి తగ్గలేదు.. మరణాలు ఆగలేదు.! మరోవైపు క్రీడా టోర్నీలన్నీ రద్దవ్వడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తమ జీవితంలోనే ఊహించని విరామాన్ని ఫ్యామిలీతో ఆస్వాదించారు. మొదట బాగానే ఉన్నా.. పోను పోనూ వారికి పిచ్చెక్కిపోయింది. ప్రాక్టీస్ లేక.. ఫిట్నెస్ కాపాడుకోలేక.. బయటకు వెళ్లలేక.. నెట్టులో నెట్టునై.. ట్విట్టులో ట్విట్టునై.. జాములో జామునై.. అంటూ ఇంటిలోనే ఉంటూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేశారు.
ఇక కరోనాతో సావాసం చేయాల్సిందేనని గ్రహించిన ప్రపంచం ఆంక్షలను అటకెక్కించి, నిర్భంధాలను తెంచేసుకొని, భౌతిక దూరాలను పాటిస్తూ.. మాస్క్లతో తమ ప్రయాణాన్ని పున:ప్రారంభించింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచం కూడా రీస్టార్ట్కు రెడీ అవుతుంది. ఇప్పటికే ఆటగాళ్లంతా తమకు అందుబాటులో ఉన్న వనరులతో ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ దాదాపు ఐదు నెలల తర్వాత మళ్లీ ట్రైనింగ్ మొదలెట్టాడు.ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్పై చివరిసారిగా టీ20 సిరీస్ ఆడిన రోహిత్ శర్మ.. మోకాలి గాయంతో ఆ టూర్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. అనంతరం కరోనా గత్తర పుణ్యమా ఇంటికే పరిమితమయ్యాడు. తాజాగా లాక్డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించడంతో ముంబయిలో అవుట్డోర్ ట్రైనింగ్ను తాను మొదలుపెట్టినట్లు రోహిత్ శర్మనే ఇన్స్టాగ్రామ్ వేదికగా స్వయంగా వెల్లడించాడు. మైదానంలో చెమటోడ్చిన పిక్ను క్యాప్షన్ లేకుండా షేర్ చేశాడు.
చాలా రోజు ఆటకు దూరంగా ఉండటంతో.. మళ్లీ మునుపటి లయని అందుకోవాలంటే క్రికెటర్లకు కనీసం 4-6 వారాల సమయం పడుతుందని కోచ్లు అభిప్రాయపడుతున్నారు. ఇక సెప్టెంబరు - నవంబరు మధ్యలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తుండటంతో.. ఒక్కొక్కరు ప్రాక్టీస్ని ప్రారంభిస్తున్నారు.
ఇక భారత్లో కరోనా తాండవం చేస్తుంది. గురువారం నాటికి మహమ్మారి బాధితుల సంఖ్య 4.74 లక్షలకి చేరుకోగా.. ఒక్క మహారాష్ట్రలోనే ఆ సంఖ్య 1,42,899గా ఉంది. ఈ నేపథ్యంలో.. చాలా మంది భారత క్రికెటర్లు ట్రైనింగ్కి దూరంగా ఉంటున్నారు. కానీ.. కరోనా వైరస్ పతాక స్థాయిలో ఉన్న ముంబైలో రోహిత్ శర్మ.. అదీ అవుట్డోర్ ట్రైనింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకూ భారత క్రికెటర్లు చతేశ్వర్ పుజారా, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రాబిన్ ఉతప్ప తదితరులు మాత్రమే తమ ప్రాక్టీస్ని ప్రారంభించారు.
పీఎస్ఎల్ వాయిదా వేసుకుంటేనే ఆసియాకప్.. లేకుంటే కష్టమే: బీసీసీఐ
View this post on InstagramGood to be back on the park getting some work done 🤩 felt like myself after a long time ✅
A post shared by Rohit Sharma (@rohitsharma45) on