For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సత్తా చాటేందుకు మా కుర్రాళ్లు ఆకలి మీదున్నారు: రోహిత్ శర్మ

Rohit Sharma impressed with talented Indian star after 2nd T20 heroics

ధర్మశాల: సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లు ఆకలి మీదున్నారని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వచ్చిన అవకాశాన్ని రెండు చేతుల అందిపుచ్చుకుంటున్నారని కొనియాడారు. శ్రీలంకతో శనివారం జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్.. కుర్రాళ్ల ప్రదర్శనను కొనియాడాడు. అంతేకాకుండా మిడిలార్డర్ బ్యాటింగ్ మెరుగైందని, ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఆడటం బాగుందన్నాడు. జడేజా, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌ అద్భుతమని కొనియాడాడు.

చూడ ముచ్చటగా..

చూడ ముచ్చటగా..

‘ఈ విజయం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మిడిలార్డ్ ముందుకు రావడం, కుర్రాళ్లు బాధ్యత వహించడం, మ్యాచ్ ముగించడం చూడ ముచ్చటగా ఉంది. బౌలర్ల పట్ల నేను కఠినంగా ఉండలేను. ఈ రోజుల్లో ఇలా ధారళంగా పరుగులిచ్చుకోవడం సర్వసాధారణం. కానీ మేం 15 ఓవర్ల వరకు కట్టడిగానే బౌలింగ్ చేశాం. ఇక పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. జట్టులో ఉన్న కుర్రాళ్లంతా ఎంతో ప్రతిభావంతమైన ప్లేయర్లు. వాళ్లంతా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సత్తా చాటాలనే ఆకలితో ఉన్నారు.

జడ్డూ, శ్రేయస్ సూపర్..

జడ్డూ, శ్రేయస్ సూపర్..

వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా చెలరేగుతూ జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఈ మ్యాచ్ ముగించిన విధానం అసాధారణం. జడేజా అద్భుతంగా తనదైన శైలిలో ఆడాడు. తొలి బంతి నుంచి చాలా పాజిటీవ్‌గా కనిపించాడు. శ్రేయస్ సైతం అదరగొట్టాడు. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో ఎవరో ఒకరు చివరి వరకు ఉండి మ్యాచ్‌ను ముగించాలని అనుకున్నాం. చివరకు అదే చేసి విజయాన్నందుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

IND VS SL: Jadeja, Shreyas మ్యాజిక్ 2-0 Lead In Series | 11th Straight T20 Win | Oneindia Telugu
రికార్డు విజయం..

రికార్డు విజయం..

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్‌ నిసాంకా (53 బంతుల్లో 11 ఫోర్లతో 75) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించాడు. చివర్లో డసన్ షనక (19 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47 నాటౌట్‌) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.

అనంతరం భారత్‌ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శ్రేయస్‌ అయ్యర్‌ (44 బం తుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 74 నాటౌట్‌), జడేజా (18 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 45 నాటౌట్‌), శాంసన్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి. చివరి టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది.

Story first published: Sunday, February 27, 2022, 8:19 [IST]
Other articles published on Feb 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+