
ఈ గెలుపుతో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఉబికి వచ్చిన దు:ఖాన్ని దాచుకొని అమ్మాయిల విజయాన్ని ఆస్వాదించాడు. సతీమణి రితికా సజ్దేతో కలిసి ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించిన రోహిత్.. సచిన్, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాలతో అమ్మాయిలకు అండగా నిలిచాడు.
విజయం వరించిన క్షణం లేచి చప్పట్లు కొట్టిన రోహిత్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. అమ్మాయిలు విజయం సాధించిన మరుక్షణమే టీవీ కెమెరాలు రోహిత్ను చూపించాయి. తీవ్ర ఆవేదనకు గురైన రోహిత్ ఆకాశం వైపు చూస్తూ.. తన దు:ఖాన్ని ఆపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఒకసారిగా రోహిత్కు తమ టీ20 ప్రపంచకప్ 2024 విజయం గుర్తొచ్చినట్లుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.