విదేశాల్లో ఆడే సీన్ లేదు..
ఇక రోహిత్ శర్మ వైఫల్యంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్సీస్ గడ్డపై ఆడే సీన్ రోహిత్ శర్మకు లేదని, స్వదేశంలో మినహా అతను ఎక్కడా రాణించలేడని కామెంట్ చేస్తున్నారు. విదేశాల్లో ఓపెనర్లు రాణించడం చాలా ముఖ్యమని, మంచి ఆరంభాలు అందిన ప్రతీసారి భారత్ అద్భుత విజయాలు సాధించిందని గుర్తు చేస్తున్నారు. డబుల్ సెంచరీల వీరుడైన రోహిత్.. విదేశాల్లో కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదలేడని కామెంట్ చేస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా రోహిత్ విఫలమయ్యాడని, అది భారత్ కొంపముంచిందని గుర్తు చేస్తున్నారు. రెండు ఇన్నింగ్స్ల్లో రోహిత్ 34, 30 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
వడాపావ్ మింగుపో..
ఇంకొందరు రోహిత్ శర్మకు వడాపావ్ తినే టైమ్ అయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అసలు రోహిత్ శర్మ ఓవర్సీస్లో రాణించిందే లేదని, అతన్ని జట్టులో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సత్తా చాటేందుకు యువ ఓపెనర్లు సిద్దంగా ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే టెస్ట్ క్రికెట్కు రోహిత్ వీడ్కోలు చెప్పాలని సూచిస్తున్నారు. రోహిత్కు ఇదే చివరి టెస్ట్ సిరీస్ అని ఒకరంటే.. విదేశాల్లో ఆడే సత్తా రోహిత్కు లేదని మరొకరు కామెంట్ చేశారు.
టాప్-3 విఫలం..
ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా టాప్-3 బ్యాట్స్మన్ దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(28),నయావాల్ చతేశ్వర్ పుజారా(21) చేతులెత్తేశారు. దాంతో 67 పరుగులకే రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(1 బ్యాటింగ్), హనుమ విహారీ(14 బ్యాటింగ్) ఉన్నారు. కౌంటీ ఎలెవన్ టీమ్లో లిండన్ జేమ్స్ రెండు వికెట్లు తీయగా.. జాక్ కార్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లయిన ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుంధర్ కౌంటీ ఎలెవన్ టీమ్ తరఫున బరిలోకి దిగారు.


Click it and Unblock the Notifications
