ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే రోహిత్ శర్మకు రెండు లైఫ్స్ లభించాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను గెరాల్డ్ కోయిట్జీ నేలపాలు చేశాడు. ఆ క్యాచ్ పట్టి ఉంటే రోహిత్ 4 పరుగులకే ఔటయ్యేవాడు. సిరాజ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ వదిలేసాడు.
ఈ క్యాచ్ పట్టినా రోహిత్ 12 పరుగులకే వెనుదిరిగేవాడు. ఈ అవకాశంతో చెలరేగిన రోహిత్ శర్మ.. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్లో 7వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు. రదీష్ ఖాన్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతిని సిక్సర్ తరలించడం ద్వారా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. 7వేల పరుగుల మైలురాయితో పాటు 300 సిక్స్ల క్లబ్లో చేరాడు.

ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(8618) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(7000*) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), సురేశ్ రైనా(5528), ధోనీ(5439) పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన జాబితాలో క్రిస్ గేల్(357) అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ(300*), విరాట్ కోహ్లీ( 291), ధోనీ(364) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.