ప్రతీ ఆటగాడికి అంకితం..
ఈ అవార్డు రావడంపై రిషభ్ పంత్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగమైన ప్రతీ భారత ఆటగాడికి ఈ అవార్డు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. 'ఏ ఆటగాడైనా జట్టును గెలిపించడమే గొప్ప రివార్డుగా భావిస్తాడు. నాలాంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇటువంటి అవార్డులు ప్రేరణగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా సిరీస్ విజయంలో సభ్యులైన ప్రతి ఇండియా క్రికెటర్కు ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.'అని రిషభ్పంత్ తెలిపాడు.

ఫిబ్రవరి రేసులో కూడా..
ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లోనూ రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కష్టాల్లో చిక్కుకున్న జట్టును ధాటైన ఇన్నింగ్స్తో 91 పరుగులు చేసి ఆదుకున్నాడు. దాంతో ఫిబ్రవరి నెల అవార్డు రేసులో కూడా అతను నిలవనున్నాడు. ఇక పంత్ను అవార్డు వరించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా స్పందించాడు. 'అతడు ఆడిన రెండు సందర్భాలు ఎంతో ఒత్తిడితో కూడుకున్నవి. రెండింటిలోనూ అద్భుత నైపుణ్యం కనబరిచాడు. ఒక మ్యాచ్లో గెలుపొందిన భారత్, మరో టెస్టును డ్రా చేసుకుంది' అని తెలిపాడు.

నెలలో రెండో సోమవారం..
మూడు ఫార్మాట్లలోని ప్రతీ క్యాటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో సాధించిన విజయాల ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్ లిస్ట్లో స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఐసీసీ డిజిటల్ ఛానెళ్లలో నెలలో ప్రతి రెండవ సోమవారం విజేతలను ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications
