For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్లీజ్.. ధోనీ‌తో న‌న్ను పోల్చొద్దు! నాకంటూ ప్ర‌త్యేక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నా'

Rishabh Pant says I dont want to be compared with MS Dhoni

ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనను ఘ‌నంగా ముగించిన భారత జట్టు స‌భ్యులు స్వదేశానికి వచ్చారు. సొంత‌గ‌డ్డ‌పై అందరికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. గురువారం తెల్ల‌వారుజాము నుంచి జట్టు స‌భ్యులు దుబాయ్ మీదుగా స్వ‌దేశానికి వచ్చారు. కెప్టెన్ అజింక్య ర‌హానే, వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ ర‌విశాస్త్రి, ఓపెన‌ర్ పృథ్వి షా ముంబైకి చేరుకున్నారు. తెలుగు ఆటగాళ్లు హనుమ విహారి, మహ్మద్‌ సిరాజ్‌లు గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇక వికెట్ కీపర్ రిష‌బ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు.

ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్

ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్

టెస్ట్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిష‌బ్ పంత్‌ను మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీతో పోలుస్తున్నారు. అందులోనూ బ్రిస్బేన్ టెస్ట్‌లో ధోనీ రికార్డును కూడా తిర‌గ‌రాయ‌డంతో.. ఈ పోలిక మ‌రింత ఎక్కువైంది. అయితే పంత్ మాత్రం త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని అంటున్నాడు. తనకంటూ ప్ర‌త్యేక పేరు తెచ్చుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. గురువారం ఢిల్లీలో అడుగుపెట్టిన పంత్ మీడియాతో మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను ధోనీతో పోల్చొద్ద‌ని కోరాడు.

ధోనీ‌తో న‌న్ను పోల్చొద్దు

ధోనీ‌తో న‌న్ను పోల్చొద్దు

'ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయ‌ర్‌తో పోలుస్తుంటే.. చాలా బాగుంటుంది. కానీ న‌న్ను ఎవ‌రితోనూ పోల్చ‌డం నాకు ఇష్టం ఉండ‌దు. ఇండియ‌న్ క్రికెట్‌లో నాకంటూ ప్ర‌త్యేకంగా పేరు సంపాదించుకోవాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌స్తుతం నా దృష్టంతా దానిపైనే. ఓ లెజెండ‌రీ ప్లేయ‌ర్‌తో ఓ యువ‌కుడిని పోల్చ‌డం స‌రికాదు. ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంతో జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను' అని రిష‌బ్ పంత్ తెలిపాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు

రిషభ్ పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. ఇక సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు.

ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన అతడు‌ త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్‌ చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించే అవకాశం ఉండేది. గబ్బా టెస్టులో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ ‌(22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్‌ భారత్‌కు అపురూప విజయం అందించాడు.

27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు

27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అరుదైన రికార్డు అందుకున్న విషయం తెలిసిందే. భారత్ తరఫున పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.

ఆ ఆటగాడిని వదులుకుని ఆర్సీబీ పెద్ద తప్పుచేసింది.. వేలంలో అలాంటి ప్లేయర్ దొరకడు: గంభీర్‌

Story first published: Thursday, January 21, 2021, 15:01 [IST]
Other articles published on Jan 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+