న్యూఢిల్లీ: టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్కు చెందిన ఓ ఫోటో వైరల్గా మారింది. ఇంగ్లండ్తో శనివారం ముగిసిన ఆఖరి టెస్ట్లో సెంచరీతో కదంతొక్కిన పంత్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని పేరు నెట్టింట మారుమోగుతోంది.
ఈ క్రమంలోనే అతని చిన్ననాటి ఓ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా నుంచి పంత్ తన బ్యాట్పై ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నాడు. దాంతో ఈ ఫొటో సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త చర్చకు దారితీసింది. గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన చిన్నతనంలో అచ్చం ఇలానే ఆశిష్ నెహ్రాతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటో కూడా ఇప్పటికే ఎన్నో సార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ రెండు ఫొటోలను పోలుస్తూ అభిమానులు ఓపెద్ద డిస్కషన్కే తెరలేపారు. ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్కు అంత పవరుందా? గతంలో కోహ్లీ సూపర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు పంత్ అదరగొడుతున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు.
Young Cricketer @RishabhPant17 Taking Autograph of Indian Cricket Team Player Ashish Nehra pic.twitter.com/7j86wINBEo
— indianhistorypics (@IndiaHistorypic) March 5, 2021
కోహ్లీ, పంత్ల సక్సెస్కు నెహ్రా ఆటోగ్రాఫే కారణమని కొందరంటుంటే.. మరి కొందరేమో నెహ్రా హస్తవాసి చాలా బాగుందని.. ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటే క్రికెటర్లు స్టార్లయిపోతారని కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషమేమిటంటే ఈ ముగ్గురు క్రికెటర్లు దేశవాళి క్రికెట్లో ఢిల్లీ జట్టకే ప్రాతినిధ్యం వహించారు.
తొలి ఇన్నింగ్స్లో 160 పరుగులు వెనుకబడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లోనూ కుప్పకూలింది. కేవలం 54.5 ఓవర్లలోనే ఆ జట్టు 135 పరుగులకు ఆలౌటైంది. డాన్ లారెన్స్ (95 బంతుల్లో 50; 6 ఫోర్లు) మినహా అంతా విఫలయ్యారు. అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48) పోటీ పడి ఐదేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 365 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (174 బంతుల్లో 96 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. అశ్విన్కు 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్'.... పంత్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారాలు లభించాయి.
ఈ గెలుపుతో వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు కూడా అర్హత సాధించి న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమైంది. జూన్ 18 నుంచి 22 వరకు లండన్లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తారు. భారత్, ఇంగ్లండ్ మధ్య ఈ నెల 12 నుంచి అహ్మదాబాద్లోనే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుంది.