రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల నెరవేరింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలి ఐపీఎల్ టైటిల్ను ముద్దాడింది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ అలుపెరగని కృషికి ఎట్టకేలకు ఫలితం దక్కింది. కోట్లాది మంది అభిమానుల బెంగ తీరింది. ఎంత మంచి జట్టుతో ఆడినా.. ఎంత మంది మేటి ఆటగాళ్లతో బరిలో నిలిచినా దక్కని టైటిల్.. 18వ ప్రయత్నంలో ఆర్సీబీ ఒడిలోకి వచ్చి చేరింది. టైటిల్తో పాటు ఈ సీజన్లో ఆర్సీబీ అనేక అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది.

ఈ సీజన్లో ఆర్సీబీ సాధించిన ఘనతలు..