న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 రిటెన్షన్ జాబితాలు ఒక్కోక్కటికిగా అభిమానుల ముందుకు వస్తున్నాయి. ఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియను చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రిటెన్షన్ లిస్ట్లను సమర్పించేందుకు నేటి(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటల వరకు ఫ్రాంచైజీలకు డెడ్లైన్ విధించింది. దాంతో ఆయా ఫ్రాంచైజీలన్నీ తమ జాబితాలను బోర్డుకు వెల్లడించాయి.
ముందుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ జాబితా విడుదలవ్వగా అందరూ ఊహించనట్లుగానే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ను రిటైన్ చేసుకుంది. అయితే మహమ్మద్ సిరాజ్ను కూడా ఆ జట్టు ఎంచుకోవడం గమనార్హం. ముగ్గురిని మాత్రమే ఆర్సీబీ రిటైన్ చేసుకోవడంతో ఫస్ట్ స్లాబ్ ప్లేయర్గా విరాట్ కోహ్లీ రూ.15 కోట్ల వేతనం అందుకోనున్నాడు. సెకండ్ స్లాబ్ ప్లేయర్గా మ్యాక్స్వెల్ రూ.12 కోట్లు, మూడో స్లాబ్ ప్లేయర్గా మహమ్మద్ సిరాజ్ రూ.7 కోట్ల వేతనం అందుకోనున్నాడు. ఈ ముగ్గురి రిటెన్షన్తో ఆర్సీబీ తమ పర్స్ వాల్యూ రూ.90 కోట్ల నుంచి రూ.33 కోట్లు కోల్పోయింది. వారి వద్ద ఇంకా రూ.57 కోట్లు ఉన్నాయి.
తాజా రిటెన్షన్తో విరాట్ కోహ్లీ రూ.2 కోట్లు నష్టపోనున్నాడు. గత సీజన్ వరకు లీగ్లోనే అత్యధికంగా రూ.17 కోట్ల వేతనం అందుకున్న విరాట్ తాజా రిటెన్షన్ నిబంధనల నేపథ్యంలో రెండు కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. ఇక మ్యాక్స్వెల్ సైతం రూ. 2 కోట్లు నష్టపోయాడు. గతేడాది ఆర్సీబీ అతన్ని రూ.14 కోట్ల భారీ దరకు కొనుగోలు చేసింది. ఇక సిరాజ్కు మాత్రం భారీ ధరనే దక్కింది. గతేడాది అతను రూ.4 కోట్ల వేతనం మాత్రమే అందుకోగా.. ఈ సారి అదనంగా రూ. 7 కోట్లు అందుకోనున్నాడు. తమ రిటెన్షన్ జాబితాను టీమ్ ఓనర్తో పాటు డైరెక్టర్ మైక్ హస్సీ వెల్లడించాడు. రిటైన్ ఆటగాళ్లు సైతం వచ్చే సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని తెలిపారు. కోహ్లీతో పాటు మ్యాక్స్వెల్, సిరాజ్లు మాట్లాడారు.
RCB రిటైన్షన్ జాబితా
విరాట్ కోహ్లీ రూ. 15 కోట్లు
మ్యాక్స్వెల్ రూ. 12 కోట్లు
మహమ్మద్ సిరాజ్ రూ. 7 కోట్లు