
ఓపెనర్లుగా శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనింగ్ స్లాట్ కోసం శిఖర్ ధావన్తో పాటు డేవిడ్ వార్నర్పై ఆర్సీబీ కన్నేసింది. డేవిడ్ వార్నర్ కోసం భారీ ధర వెచ్చిచ్చేందుకు కూడా ఆర్సీబీ సిద్దంగా ఉంది. వార్నర్ను తీసుకుంటే కెప్టెన్సీ లోటు కూడా తీరుతుందని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. శిఖర్ ధావన్ కోసం గట్టిగానే ప్రయత్నించాలనుకుంటుంది. ఓ ఫారిన్ ఓపెనర్తో పాటు స్వదేశీ ఓపెనర్ను బరిలోకి దించాలనుకుంటుంది. వార్నర్ దొరకకపోతే.. జానీ బెయిర్ స్టోలను ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. అయితే అభిమానులు మాత్రం వార్నర్, ధావన్ ఓపెనింగ్ జోడీ సూపర్బ్ అని, గతంలో సన్రైజర్స్ ఈ ఇద్దరు కలిసి ఆడారని గుర్తు చేస్తున్నారు.

మిడిలార్డర్లో విరాట్, కేఎస్ భరత్, మ్యాక్సీ, మిచెల్ మార్ష్
ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లను తీసుకోవడం కష్టమైన పని. ఈ ఇద్దరికి ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీళ్లు భారీ ధర పలికే చాన్సుంది. కాబట్టి వీరిని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయంగా గత సీజన్లో అదరగొట్టిన కేఎస్ భరత్తో పాటు ప్రపంచకప్లో మెరిసిన మిచెల్ మార్ష్లను తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. మిచెల్ మార్ష్ ఫిట్నెస్ విషయాన్ని పరిగణలోకి తీసుకొనే ఈ నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ఫిట్గా లేకుంటే ప్రత్యామ్నాయ ఆల్రౌండర్పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

స్పిన్నర్లుగా చాహర్, సుంధర్..
స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుంధర్, స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్గా రాహుల్ చాహర్లను ఆర్సీబీ తీసుకునే చాన్సుంది. తమ మాజీ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ కోసం కూడా ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. కానీ తీవ్ర పోటీ కారణంగా అతను ఆర్సీబీ చేజారే అవకాశం ఉంది. శ్రీలంక ఆల్రౌండర్ వానిందు హసరంగా, నాథన్ లయన్లను కూడా ఆర్సీబీ టార్గెట్ చేయవచ్చు. కానీ ఇండియన్ స్పిన్నర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు సూచిస్తున్నారు. ఈ లెక్కన సుంధర్, చాహర్ మంచి ఎంపికని అభిప్రాయపడుతున్నారు.

పేసర్లుగా కమిన్స్, సిరాజ్, నటరాజన్..
జట్టు పేసర్లుగా ప్యాట్ కమిన్స్, కగిసో రబడా, ప్రసిధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, నటరాజన్, క్రిస్ జోర్డాన్లను ఆర్సీబీ టార్గెట్గా పెట్టుకుంది. వేలానికి భారీ డబ్బే ఉండటంతో స్టార్ ప్లేయర్లకు ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తోంది. అయితే కమిన్స్, రబడా వంటి ఆటగాళ్లు రూ. 15 కోట్లకు పైగా పలికే అవకాశం ఉంది కాబట్టి భారత పేసర్లే ఆర్సీబీకి దక్కే చాన్సుంది.
నటరాజన్, ప్రసిధ్ కృష్ణలలో ఒకరిని కొనుగోలు చేసే చాన్సుంది. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉన్న నేపథ్యంలో అతనికి తోడుగా ఓ ఫారిన్ ప్లేయర్ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది. ప్యాట్ కమిన్స్, కగిసో రబడాల్లో ఒకరిని కచ్చితంగా తీసుకోనుంది.

ఆర్సీబీ ప్రాబబుల్ ఎలెవన్
డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), గ్లేన్ మ్యాక్స్వెల్, కేఎస్ భరత్, మిచెల్ మార్ష్, వాష్టింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్/రబడా, మహమ్మద్ సిరాజ్, నటరాజన్, రాహుల్ చాహర్


Click it and Unblock the Notifications












