
మరే ఆల్రౌండర్..
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో మెరుపు ఫీల్డింగ్తో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా బ్యాటింగ్లో విలువైన 57 పరుగులు చేసి.. బౌలింగ్లో మూడు కీలక వికెట్లు తీశాడు. గత కొంతకాలంగా మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా రవీంద్ర జడేజా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 50 టెస్టులాడిన జడేజా 1,926 పరుగులు, 168 వన్డేల్లో 2,411, 50 టీ20ల్లో 217 రన్స్ చేశాడు. బౌలింగ్లోనూ అతను టెస్టుల్లో 216 వికెట్లు, వన్డేల్లో 188, టీ20ల్లో 39 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా భారత క్రికెట్లో ఈ తరహాలో మరే ఆల్రౌండర్ కూడా మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణించలేదు.

గొప్ప గౌరవం..
ఇలా మూడు ఫార్మాట్లలో రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. తను ఈ ఘన సాధించిన సందర్భంగా జడేజా.. ధోనీ, కోహ్లీతో మూడు ఫార్మాట్లలో కలిసి ఉన్న ఫొటోలను జడేజా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘‘మహి భాయ్, విరాట్ కోహ్లీ క్లబ్లో చేరడం ఓ గొప్ప గౌరవం'అని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ జడేజా అంతర్జాతీయ స్థాయిలో 50 టెస్టు మ్యాచులు, 168 వన్డేలు, 50 టీ20లు ఆడాడు.

అద్భుత విజయం..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 133/6తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్లో 200 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (146 బంతుల్లో 45; 5 ఫోర్లు) ఇన్నింగ్స్ టాప్ స్కోరర్గా నిలవగా, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 131 పరుగుల ఆధిక్యాన్ని మినహాయించి భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత్ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి దీనిని అందుకుంది. సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications
