
చనిపోయినట్లే రాసారు..
ఐపీఎల్ 2022 సీజన్లో గాయపడ్డ తాను తాను టీ20 వరల్డ్ కప్కు దూరం అవుతానని ప్రచారం చేశారని, తాను వరల్డ్ కప్ జట్టులో భాగం కాననేది చిన్న రూమర్ మాత్రమేనన్న జడేజా.. ఓసారి తాను చనిపోయాననే వార్త కూడా వైరల్ అయ్యిందన్నాడు. అలాంటి రూమర్లతో పోలిస్తే ఇదెంత.. అన్నట్టుగా వ్యాఖ్యానించాడు. 'రూమర్ల గురించి నేను ఏ మాత్రం ఆలోచించను.
మైదానంలో బాగా ఆడటంపైనే నా ఫోకస్ ఉంటుంది. మరింత మెరుగవ్వడంపైనే దృష్టిసారిస్తా. మైదానంలోకి వెళ్లి ఆడటమే నా పని. పరిస్థితులకు తగ్గట్లు ఎలా ఆడాలో.. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో మెరుగ్గా రాణించడంపై నెట్స్లో వర్క్ చేయడమే నా పని. అంతేగానీ బయటి విషయాలు గురించి ఆలోచించే టైమ్ నాకు ఉండదు'అని తెలిపాడు.

ఐపీఎల్లో విఫలం..
ఐపీఎల్ 2022లో జడేజా తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన జడ్డూ కెప్టెన్సీ భారాన్నిమోయాలేకపోయాడు. 19.33 యావరేజ్తో జడ్డూ 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. గాయం కారణంగా టోర్నీ చివరి మ్యాచ్లకు జడేజా దూరమయ్యాడు. అయితే మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పించడంతోనే జడేజా జట్టుకు దూరమయ్యాడని అప్పట్లో ప్రచారం జరిగింది. గాయం నుంచి వేగంగా కోలుకున్న జడ్డూ.. ఇంగ్లండ్తో టూర్కు వెళ్లాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టులో సెంచరీ బాదాడు.

సూపర్ బ్యాటింగ్..
ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 35 పరుగులు చేసిన జడేజా.. హార్దిక్ పాండ్యతో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లో జడ్డూ ఔటయినప్పటికీ.. అప్పటికే మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. హార్దిక్ పాండ్య సిక్స్ బాది జట్టును గెలిపించాడు. బుధవారం దుబాయ్ వేదికగా హాంగ్ కాంగ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ టీమిండియాకు నెట్ ప్రాక్టీస్లా ఉపయోగపడనుంది.


Click it and Unblock the Notifications












