
ధోనీని ట్రోల్ చేస్తూ..
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కట్టుదిట్టమైన ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డర్లు అందరినీ బ్యాట్స్మెన్ చుట్టూనే ఏర్పాటు చేశాడు. దీంతో ఎలాగైనా ఆ ఒక్క వికెట్ సాధించి నాలుగో టెస్టును గెలవాలని చూశాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలమై ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉండగా, ఐపీఎల్లో ఒకసారి గౌతమ్ గంభీర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉన్నప్పుడు.. రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ తరఫున బ్యాటింగ్ చేస్తున్న ధోనీకి అచ్చం ఇలాంటి ఫీల్డింగే ఏర్పాటు చేశాడు. ధోనీ డిఫెన్స్ను కట్టడి చేయాలని చుట్టూ నలుగురు ఫీల్డర్లను మోహరించాడు. తాజా మ్యాచ్లోని ఈ సన్నివేశం.. కేకేఆర్ జట్టుకు ఒకప్పటి గంభీర్ చేసిన పనిని గుర్తు చేసింది.
అది షో ఆఫ్..
దాంతో నాటి ధోనీ ఫొటోతో సహా తాజా మ్యాచ్లోని ఆండర్సన్కు ఏర్పాటు చేసిన ఫీల్డింగ్ ఫొటోను కేకేఆర్ ట్వీట్ చేసింది. 'టెస్టుల్లో క్లాసిక్ సన్నివేశం.. మీకు టీ20ల్లో మాస్టర్ స్ట్రోక్ను గుర్తు చేస్తే ఇలా ఉంటుంది' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన చెన్నైసూపర్ కింగ్స్ ఆల్రౌండర్ జడేజా తనదైనశైలిలో స్పందించాడు. అది మాస్టర్ స్ట్రోక్ కాదు. కేవలం షో ఆఫ్ అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. మరోవైపు పలువురు ధోనీ అభిమానులు కూడా కేకేఆర్ టీమ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఫైర్..
ఫన్నీ పోస్టులు మీమ్స్ షేర్ చేస్తూ కేకేఆర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ రెండు జట్లూ గతేడాది ఐపీఎల్ ఫైనల్లో చివరిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగులతో గెలుపొంది నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. మరోవైపు చెన్నై టీమ్ ఐపీఎల్ 2022కు జడేజాను అట్టిపెట్టుకుంది. కెప్టెన్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను కూడా ఆ జట్టు రిటైన్ చేసుకోవడం విశేషం. మార్చి 25 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications
