టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల డ్యాన్స్కు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్కు శ్రీలీల దుమ్మురేపింది. అదిరిపోయే స్టెప్పులతో అభిమానుల మనసులను దోచుకుంది.
తాజాగా ఈ సినిమా గురించి తన యూట్యూబ్ చానెల్లో ప్రస్తావించిన అశ్విన్.. ఈ సాంగ్ను చూడాలని అభిమానులను కోరాడు. ఓ అభిమానితో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. 'మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్లో శ్రీలీల డ్యాన్స్ భయంకరంగా ఉంది. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్లో గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ అని టైప్ చేసి చూడండి.

మహేశ్ బాబు, శ్రీలీల అదిరిపోయే పెర్ఫెమెన్స్ ఇచ్చారు. ఈ సాంగ్ ఐపీఎల్లో సన్రైజర్స్ జట్టుకు మంచి ఊపు తీసుకొస్తుంది.'అని తెలిపాడు. ఈ వీడియోను మహేశ్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో వైరల్గా మారింది.
ఐపీఎల్లో అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంగళవారమే ఆ జట్టుతో కలిసాడు. స్పిన్ ఆల్రౌండర్గా అశ్విన్ రాజస్థాన్ రాయల్స్కు కీలకం కానున్నాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఓ తాగుబోతు, యూట్యూబ్ ఫేమస్ చెప్పిన కుర్చీ మడతపెట్టి మాటను
ఎస్ఎస్ థమన్ సాంగ్గా స్వరపరిచాడు. ఆరంభంలో ఈ సాంగ్పై తీవ్ర విమర్శలు వచ్చినా.. మాస్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యింది. అశ్విన్ సైతం ఈ సాంగ్కు ఫిదా అయ్యాడు.