న్యూఢిల్లీ : చిన్నమైదానాల్లో విరాట్ కోహ్లీ, ఏబీ డీవిలియర్స్, క్రిస్గేల్, ఆండ్రూ రసేల్ లాంటి గొప్ప బ్యాట్స్మెన్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని అఫ్గానిస్థాన్
సంచలనం రషీద్ ఖాన్ తెలిపాడు. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్తో ఇన్స్టాగ్రామ్ లైవ్సెషన్లో పాల్గొన్న రషీద్.. ఐపీఎల్ గురిచి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'చిన్న మైదానాల్లో విరాట్ కోహ్లీ, ఏబీడీ, రస్సెల్, క్రిస్ గేల్లకు బౌలింగ్ చేయడం చాలా కష్టం. మ్యాచ్కు ముందే వికెట్ నుంచి ఎలాంటి మద్దతు లభించదని ఆలోచనలు వస్తాయి.'అని తెలిపాడు. ఇక ఐపీఎల్లో ఆడటం తన కలని ఈ అఫ్గాన్ సంచలనం తెలిపాడు.
'ఐపీఎల్ ఆడటం అనేది నాకల. టీవీలో ఐపీఎల్ చూస్తూ పెరిగా. అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఐపీఎల్లో ఉంటారు. కోచింగ్ స్టాఫ్ కూడా ఎంతో అనుభవం కలిగినవారుంటారు.'అని తెలిపాడు.
ఇక ఐపీఎల్ తొలిమ్యాచ్లో చాలా నిరుత్సాహ పడ్డాడని తరువాత బౌలింగ్ను ఆస్వాధించానని రషీద్ గుర్తు చేసుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుండగా తన బౌలింగ్లో మొదటి బంతినే బ్యాట్స్మెన్ బౌండరీ బాదడంతో నిరుత్సాహానికి గురయ్యాయని, తొలివికెట్ దక్కగానే కాస్త నమ్మకం వచ్చిందని..రెండో వికెట్ తీయగానే బౌలింగ్ను ఆస్వాధించానని చెప్పాడు.
ధోనీ బయోపిక్ హీరో ఆత్మహత్య.. శోకసంద్రంలో క్రికెట్ లోకం