
రెండేళ్ల విరామం తర్వాత..
ఇక సుదీర్ఘ విరామం అనంతరం నేడు(గురువారం) రంజీ ట్రోఫీ ప్రారంభమైంది. ఇండియా క్రికెట్కు వెన్నుముకగా ఉన్న ఈ మెగా ట్రోఫీకి కరోనా కారణంగా రెండేళ్లు బ్రేక్ పడింది. మూడో వేవ్ నుంచి కాస్త ఉపశమనం లభించడంతో డొమెస్టిక్ క్రికెటర్ల ఎదురుచూపులు ఫలించాయి. బీసీసీఐ పక్కాగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో ఈ టోర్నీ మొదలైంది. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు గౌహతి వేదికగా మొదటి మ్యాచ్లో తలపడుతున్నాయి.

130 బంతుల్లోనే..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తమిళనాడు ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్కు దిగింది. అండర్ 19 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో సీనియర్ టీమ్లో చోటు దక్కించుకున్న యశ్ ధుల్.. తన ఫస్ట్ మ్యాచ్లోనే ఓపెనర్గా బరిలోకి దిగి దుమ్మురేపాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నానే బెరుకు లేకుండా తనదైన బ్యాటింగ్తో అలరించాడు. ఈ క్రమంలో 136 బంతుల్లోనే యశ్ ధుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 150 బంతులు ఎదుర్కొన్న అతను 113 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు ఉన్నాయి. మహమ్మద్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.

మరో కోహ్లీ అంటూ..
ఇక తమిళనాడు వంటి పటిష్ట జట్టుపై అరంగేట్ర మ్యాచ్లోనే యశ్ ధుల్ సెంచరీ చేయడంపై అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యశ్ ధుల్ మరో కోహ్లీ అవుతాడంటూ కొనియాడుతున్నారు. నీలాంటి అత్యుత్తమ ఆటగాడిని ఢిల్లీ క్యాపిటల్స్ లక్కీగా తక్కువ ధరకే సొంతం చేసుకుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ రూ. 50 లక్షల రూపాయలకే యశ్ ధుల్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇక యశ్ ధుల్కు అండగా.. జాంటీ సింధు(71) హాఫ్ సెంచరీతో రాణించగా.. లలిత్ యాదవ్(43 నాటౌట్) పోరాడుతున్నాడు. ప్రస్తుతం 88 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. క్రీజులో లలిత్ యాదవ్తో పాటు సిమ్రన్జిత్ సింగ్(16 నాటౌట్) ఉన్నాడు.


Click it and Unblock the Notifications












