For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆ రూల్స్ మార్చితే.. ఐపీఎల్ ఎవ్వరు ఆడరు: రమీజ్ రాజా

Ramiz Raja says If we take PSL to auction model, then we’ll see who goes to play IPL over PSL

హైదరాబాద్: 'మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగ నూనె'అన్నట్లుంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా తీరు. ఆటగాళ్లకు సరిగ్గా జీతాలు ఇచ్చే దిక్కులేదు కానీ.. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) రూల్స్ మార్చితే ఐపీఎల్ క్రేజ్ పడిపోతుందని బీరాలు పలుకుతున్నాడు. ఐపీఎల్‌లో అన్ క్యాప్‌డ్ ప్లేయర్లకు దక్కే జీతం కూడా పీఎస్‌ఎల్ టాప్ క్లాస్ ప్లేయర్‌కు అందదు. ఏ లేక్కన చూసుకున్న ఐపీఎల్‌కు పీఎస్‌ఎల్ పోటీనే కాదు. కానీ రమీజ్ రాజా మాత్రం.. పీఎస్‌ఎల్‌ను వేలం మోడ్‌లోకి మార్చి ఫ్రాంచైజీల పర్స్‌మనీ పెంచితే ఐపీఎల్‌ను మించిపోతదంటున్నాడు.

ఓవర్‌సీస్ ఆటగాళ్లు క్యూ కడుతారు..

ఓవర్‌సీస్ ఆటగాళ్లు క్యూ కడుతారు..

వీదేశీ ఆటగాళ్లంతా పాకిస్థాన్‌కు క్యూ కడతారని, ఐపీఎల్‌ను కాదని మరీ పీఎస్‌ఎల్ ఆడుతారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘ఆర్థికంగా మరింత బలమయ్యేందుకే మేం కొన్ని ఆస్తులను సృష్టించుకోవాలి. ప్రస్తుతం మా వద్ద పీఎస్‌ఎల్, ఐసీసీ నిధుల తప్ప ఏమీ లేవు. వచ్చే ఏడాది జరిగే పీఎస్‌ఎల్‌కు సంబంధించిన విధానంపై ఓ వాదన ఉంది. వచ్చే ఏడాది నుంచి పీఎస్‌ఎల్ వేలం మోడ్‌లోకి మార్చాలనేది నా అభిప్రాయం. ఈ విధానానికి మార్కెట్ అనుకూలంగా ఉంది.

పీసీబీ గౌరవం పెరుగుతోంది..

పీసీబీ గౌరవం పెరుగుతోంది..

ఫ్రాంచైజీ యాజమానులతో దీనిపై చర్చిస్తాను. క్రికెట్ డబ్బుల ఆట. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా బలపడితే మనపై గౌరవం రెట్టింపు అవుతుంది. పీసీబీకి ప్రధాన ఆర్థిక వనరు పీఎస్‌ఎల్. ఈ ధనాధన్ లీగ్‌ను వేలం ఫార్మాట్‌లోకి మార్చి, ఫ్రాంచైజీల పర్స్ మనీ పెంచితే ఐపీఎల్ డిమాండ్‌ను తగ్గించవచ్చు. అప్పుడు పీఎస్‌ఎల్‌ను కాదని ఏ విదేశీ ఆటగాడు ఐపీఎల్‌కు వెళ్లలేడు. వచ్చేడాది పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్ తరహాలోనే హోమ్, అండ్ అవే పద్దతిలో నిర్వహించాలనుకుంటున్నాం. అప్పుడు గేట్ మనీ చాలా వస్తుంది.

ఫ్రాంచైజీలకు డబ్బులే డబ్బులు..

ఫ్రాంచైజీలకు డబ్బులే డబ్బులు..

ప్రతీ జట్టు పర్స్ పెరుగుతుంది. అయితే ఇదంతా జరగాలంటే ఫ్రాంచైజీలు ముందు మరిన్ని డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మెగా వేలం విధానంలో నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభ కలిగిన ఆటగాళ్లంతా అందుబాటులోకి వస్తారు. ఈ విషయంపై ఇప్పటికే నేను పలువురు ఫ్రాంచైజీ ఓనర్లతో మాట్లాడాను. వారంతా ఈ విధానం పట్ల సముఖంగా ఉన్నారు. మరికొందరితో మాట్లాడాల్సి ఉంది. ప్రస్తుతం సంపద్రింపుల దశలో ఉన్నప్పటికీ నా కోరికల లిస్ట్‌లో మాత్రం టాప్‌లో ఉంది'అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.

T20 World Cup :If PM Modi Wants, India Can Shut Down Pak Cricket Board - Ramiz Raja| Oneindia Telugu
భారత ఫ్యాన్స్ సెటైర్స్..

భారత ఫ్యాన్స్ సెటైర్స్..

ఇక రమీజ్ రాజా వ్యాఖ్యలపై భారత అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐపీఎల్ క్రేజ్ గురించి మాట్లాడటం తర్వాత కానీ... ఆటగాళ్లకు జీతాలు సరిగ్గా ఇవ్వండని చురకలంటిస్తున్నారు. అంతేకాకుండా పాక్ పర్యటనకు వచ్చిన ఆటగాళ్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచిస్తున్నారు. పీఎస్‌ఎల్‌లో తనకు రావాల్సిన డబ్బులు చెల్లించలేదంటూ.. ఆసీస్ ప్లేయర్ జేమ్స్ ఫాల్కనర్ లీగ్ మధ్యలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇక టెస్ట్ సిరీస్ ఆడుతున్న మార్నస్ లబుషేన్.. తనకు నాణ్యత లేని ఆహారం పెట్టారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. పీఎస్‌ఎల్‌లో తనకు కుళ్లిపోయిన ఎగ్ ఇచ్చారని అలెక్స్ క్యారీ ఆరోపించాడు. వీటన్నిటిని సరిచేసుకోవాలని భారత అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు.

Story first published: Tuesday, March 15, 2022, 17:22 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+