స్మిత్పై వేటు తప్పదా:
తాజా సీజన్లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ ఏడాది వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ (ఆర్ఆర్) అతన్ని వదులుకోవాలని చూస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది. గత సీజన్లో కెప్టెన్గా, ఆటగాడిగా పేలవ ప్రదర్శన చేసినందుకు స్మిత్పై వేటు వేయాలని ఆర్ఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే స్మిత్ స్థానంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.
4 మ్యాచ్లలో 311 రన్స్:
ఐపీఎల్ 2020లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ఆఖరి స్థానంలో నిలిచింది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టినా.. ఆ తర్వాత పేలవ ఆటతో మూల్యం చెల్లించుకుంది. ఆర్ఆర్ వరుసగా మూడో ఏడాది ప్లేఆఫ్ బెర్తు కూడా దక్కించుకోలేకపోయింది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ పేలవ ప్రదర్శన, కెప్టెన్గానూ జట్టును నడిపించిన తీరుపై యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే వేటు వేయాలని చూస్తోంది. లీగ్లో మొత్తం 14 మ్యాచ్లు ఆడిన స్మిత్.. 131 స్ట్రైక్ రేట్తో 311 రన్స్ చేశాడు. అందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. 2018 మెగా వేలానికి ముందు రాజస్థాన్ అట్టిపెట్టుకున్న ఏకైన ఆటగాడు స్మిత్. అతని కోసం రూ.12.5కోట్లకు వెచ్చించింది.
రహానే నుంచి బాధ్యతలు:
ఏడాది నిషేధం కారణంగా ఐపీఎల్ 2018 సీజన్కి దూరమైన స్టీవ్ స్మిత్.. ఐపీఎల్ 2019 సీజన్ మధ్యలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతల్ని అజింక్య రహానే చేతి నుంచి అందుకున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2020 సీజన్కి కూడా కెప్టెన్గా కొనసాగిన స్మిత్.. ఆడిన 14 మ్యాచ్ల్లో నిరాశపరిచాడు. భారత్తో సిడ్నీ వేదికగా సోమవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్లో రిషబ్ పంత్ గార్డ్ మార్క్ని స్మిత్ చెరిపేయడం స్టంప్ కెమెరాకు చిక్కింది. దాంతో మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా స్మిత్ తీరుపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. రాజస్థాన్ అతన్ని వదులుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని వార్తలు వస్తున్నాయి.
కరోనా లేదు.. సైనాకు లైన్ క్లియర్!! శ్రీకాంత్ ముక్కులో నుంచి రక్తం!